త‌ల్లి మ‌ర‌ణ‌వార్త తెలిసి ఇంద్రాణికి గుండెపోటు?

కూతురు షీనాబోరాని హ‌త్య చేసింద‌నే ఆరోప‌ణ‌ల‌తో సంచ‌ల‌నాత్మ‌క కేసు నిందితురాలైన ఇంద్రాణి ముఖ‌ర్జీకి అక‌స్మాత్తుగా తీవ్రమైన ఛాతీనొప్పి వ‌చ్చింది. దీంతో ఆమె శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ముంబ‌యిలోని జెజె హాస్పిట‌ల్లో జేర్చారు.  Advertisement ఈ…

కూతురు షీనాబోరాని హ‌త్య చేసింద‌నే ఆరోప‌ణ‌ల‌తో సంచ‌ల‌నాత్మ‌క కేసు నిందితురాలైన ఇంద్రాణి ముఖ‌ర్జీకి అక‌స్మాత్తుగా తీవ్రమైన ఛాతీనొప్పి వ‌చ్చింది. దీంతో ఆమె శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ముంబ‌యిలోని జెజె హాస్పిట‌ల్లో జేర్చారు. 

ఈ సంద‌ర్భంగా డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ… ఆమెను ఆసుపత్రిలో జేర్చుకున్న విష‌యాన్ని ధృవీక‌రించారు. తాను తీవ్రమైన ఒత్తిడికి గుర‌వుతున్నాన‌ని, ఛాతీలో బాగా నొప్పి కూడా ఉంద‌ని ఆమె చెప్పార‌న్నారు. తాము ఆమెకు ప్రస్తుతం కొన్ని ప‌రీక్షలు నిర్వహిస్తున్నామ‌ని, ఆ త‌ర్వాత మాత్రమే ఇంద్రాణి ఆరోగ్య స‌మ‌స్యపై ఒక నిర్ధార‌ణ‌కు రాగ‌ల‌మ‌ని అన్నారు. 

కొన్ని రోజుల క్రిత‌మే ఇంద్రాణి త‌ల్లి, గ‌త రెండేళ్లుగా అనారోగ్యంతో మంచం ప‌ట్టిన 82 ఏళ్ల దుర్గా రాణి బోరా గౌహ‌తిలో మృతి చెందారు. అయితే ఆమె చ‌నిపోయిన విష‌యం ఇంద్రాణికి వెంట‌నే తెలియ‌జేయ‌లేద‌ని, బ‌హుశా అది తెలియ‌డంతో అస‌లే గ‌త కొంత‌కాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇంద్రాణి ని అది మ‌రింత కృంగిపోయేలా చేసి ఉండ‌వ‌చ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు ఇంద్రాణి తండ్రి ఉపేంద్ర బోరా కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.