భర్త పక్కచూపులు.. భార్య ఆత్మహత్య

ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చూడచక్కని కాపురం. అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో సాయిసుఖీత్ పక్కచూపులు చూడడం ప్రారంభించాడు. పెళ్లయిన ఐదేళ్లకే పరాయి స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ప్రేమించి…

ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చూడచక్కని కాపురం. అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో సాయిసుఖీత్ పక్కచూపులు చూడడం ప్రారంభించాడు. పెళ్లయిన ఐదేళ్లకే పరాయి స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇలా చేయడంతో తట్టుకోలేకపోయిన శివానీ ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ అంబర్ పేట్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శివానీ, సాయిసుఖీత్ దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్నారు. అందర్నీ ఒప్పించి 2014లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఉద్యోగాలు కూడా బాగున్నాయి.

కానీ గడిచిన 6 నెలలుగా సుఖీత్ ప్రవర్తన మారింది. మరో అమ్మాయితో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. దీనికితోడు కట్నం తీసుకురమ్మని శివానీని వేధించడం మొదలుపెట్టాడట.

దీంతో మానసికంగా కుంగిపోయిన శివానీ, పలుమార్లు భర్తతో గొడవపెట్టుకుంది. అయితే భర్త మాత్రం అవేం పట్టించుకోకుండా తన దారి తాను చూసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శివానీ ఆత్మహత్యకు పాల్పడింది.

సుఖీత్ వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ శివానీ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో కేసుపెట్టారు.