భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తీవ్ర ప్రభావం చూపింది. ఐపీఎల్ 18వ సీజన్ నిరవధిక వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్ ముగింపు దశకు సమీపించింది. ప్లే ఆఫ్స్ రేసు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. అయితే విదేశీ క్రీడాకారులు ఎక్కువ పాల్గొంటుండడం, అన్నిటికి మించి ఆటగాళ్ల భద్రత ముఖ్యమని బీసీసీఐ భావించింది.
అందుకే విదేశీ క్రీకెట్ క్రీడాకారులను వాళ్ల సొంత దేశాలకు సురక్షితంగా పంపడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. అలాగే ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదని బీసీసీఐ అధికారులు తెలిపారు.
టార్గెట్గా దేశంలోని కొన్ని ప్రాంతాలను పాక్ ఎంచుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్లను భద్రతా కారణాల రీత్యా ముందు జాగ్రత్తలో భాగంగా రద్దు చేశారు. గత రాత్రి ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కూడా మ్యాచ్ను రద్దు చేశారు. అన్ని దశలు దాటుకుని ఈ నెల 25న ఫైనల్ మ్యాచ్ నిర్వహించాల్సి వుంది.
ఫైనల్ మ్యాచ్ కోల్కతాలో నిర్వహించాల్సి వుంది. అయితే ఏ రకంగానూ ఇప్పుడు మ్యాచ్లు నిర్వహించడం ఆటగాళ్ల భద్రత రీత్యా సరైంది కాదని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంపై ఆధారపడి వుంటుంది.
good decision… country first… rest next…
yesterday it was a panic situation in the stadium…. IPL holds more than 1 lakh at a single place which is unsafe during war…. good decision
don’t need worry about the world’s richest sports organization BCCI