హైదరాబాద్ లో దారుణం… బాలికపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిథిలోని వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్న ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అమ్మాయి పదో తరగతి చదువుతోంది. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్లు…

హైదరాబాద్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిథిలోని వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్న ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అమ్మాయి పదో తరగతి చదువుతోంది. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్లు ఆమె తోటి విద్యార్థులే.

స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్ చేసిన విద్యార్థులు, దుర్మార్గాన్ని వీడియో తీశారు. విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు.

అలా బెదిరించిన విద్యార్థులు,10 రోజుల తర్వాత మరోసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే అదే సమయంలో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది కాస్తా వైరల్ అయింది.

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసిన ఐదుగురుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లోని ఓ పబ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పబ్ బయట ఉన్న అమ్మాయిని కారులో ఎక్కించుకొని, అత్యాచారానికి ఒడిగడ్డారు కొంతమంది దుర్మార్గులు. ఆ ఘటనను మరిచిపోకముందే, ఇప్పుడిలా సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది.