ప్రియుడితో రాస‌లీల‌లు-భ‌ర్త ఏం చేశాడంటే!

ప్రియుడితో భార్య రాస‌లీలల్లో మునిగితేలిన స‌మ‌యంలో ఇంట్లోకి భ‌ర్త ప్ర‌వేశించాడు. ప‌రాయి పురుషుడితో భార్య ఏకాంతంగా గ‌డ‌ప‌డం చూసి త‌ట్టుకోలేక‌పోయాడు. దీంతో అత‌ను భార్య‌, ప్రియుడిని ఇంట్లోనే బంధించి, గడియ పెట్టి, తాళం వేసి…

ప్రియుడితో భార్య రాస‌లీలల్లో మునిగితేలిన స‌మ‌యంలో ఇంట్లోకి భ‌ర్త ప్ర‌వేశించాడు. ప‌రాయి పురుషుడితో భార్య ఏకాంతంగా గ‌డ‌ప‌డం చూసి త‌ట్టుకోలేక‌పోయాడు. దీంతో అత‌ను భార్య‌, ప్రియుడిని ఇంట్లోనే బంధించి, గడియ పెట్టి, తాళం వేసి నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

బాధిత భ‌ర్త మ‌ధుసూద‌న్ సైనికుడు కావ‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని రెహ్మ‌త్‌న‌గ‌ర్‌లోని యాద‌గిరిన‌గ‌ర్‌లో సైనికుడు మ‌ధుసూద‌న్ భార్య ఇంటిని అద్దెకు తీసుకుంది. భ‌ర్త సైనికుడు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు.  

ప్రియుడు జ్ఞానేశ్వ‌ర్‌ను భ‌ర్త‌గా న‌మ్మించి, ఇంటిని అద్దెకు తీసుకున్న విష‌యం తాజాగా బ‌య‌ట‌ప‌డింది. భార్యాపిల్ల‌ల్ని చూసేందుకు అక‌స్మాత్తుగా మ‌ధుసూద‌న్ ఇంటికెళ్లాడు. ఇంట్లో ప్రియుడితో భార్య రాస‌లీల‌ల్లో మునిగి తేలుతుండ‌గా చూసి షాక్ తిన్నాడు.

ప్రియుడితో పాటు భార్య‌ను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఆ త‌ర్వాత అత‌ను నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లాడు. భార్య‌, ఆమె ప్రియుడి కామ‌క‌లాపాల గురించి వివ‌రించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన వైనాన్ని వివ‌రించి ఫిర్యాదు చేశాడు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం పోలీసుల ప‌రిధిలో ఉంది. మొత్తానికి ప్రియుడిని భ‌ర్త‌గా న‌మ్మించి, సంసారం సాగిస్తున్న తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.