ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. గొంతుకోసిన ప్రియుడు

అక్రమ సంబంధాలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చివరకు ఏమవుతాయో తెలిపే సంఘటన ఇది. హైదరాబాద్ లోని బాలానగర్ అంబికా కాలనీలో ఈరోజు నడిరోడ్డుపై జరిగిన హత్య దీనికి నిదర్శనంగా నిలిచింది. ఒక వ్యక్తితో సహజీవనం…

అక్రమ సంబంధాలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చివరకు ఏమవుతాయో తెలిపే సంఘటన ఇది. హైదరాబాద్ లోని బాలానగర్ అంబికా కాలనీలో ఈరోజు నడిరోడ్డుపై జరిగిన హత్య దీనికి నిదర్శనంగా నిలిచింది. ఒక వ్యక్తితో సహజీవనం చేసి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆఖరికి ప్రియుడి చేతిలో ఆమె హత్యకు గురైంది.

ఆమె పేరు శారద, అతనిపేరు హరికృష్ణ. ఇద్దరూ మిర్యాలగూడ వాసులు. హైదరాబాద్ నగరానికి వచ్చి బాలానగర్ లో 7 నెలల నుంచి ఒకే రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అన్యోన్యంగా ఉంటున్నారు. చుట్టుపక్కలవారంతా వారు భార్యాభర్తలే అనుకున్నారు.

అయితే సడన్ గా వారిద్దరి మధ్య ఏదో బెడిసింది. విడిపోయారు. విడిపోయిన తర్వాత శారద కొత్త ప్రేమాయణం స్టార్ట్ చేసింది. రవి అనే మరో వ్యక్తితో చనువుగా ఉంది. దీంతో హరికృష్ణకు కోపం వచ్చింది. తనని కాదని రవితో క్లోజ్ గా ఉన్నందుకు శారదపై కోపం పెంచుకున్నాడు.

ఆ తర్వాత శారద, ఏకంగా రవిని పెళ్లి చేసుకోవడంతో హరికృష్ణలో మరింత ఉక్రోషం పెరిగింది. చివరకు శారదను నడిరోడ్డుపైనే చంపేసి హంతకుడయ్యాడు.

శారద గొంతుకోసి.. నడిరోడ్డుపై నడచి వెళ్తున్న శారదను దారికాచి హత్య చేశాడు హరికృష్ణ. అంబికా కాలనీలో నడచి వెళ్తున్న శారదను అడ్డుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న కత్తి తీసి అందరూ చూస్తుండగానే శారద గొంతు కోశాడు. ఆమె చనిపోయిందని నిర్థారించుకున్న తర్వాత అక్కడినుంచి పారిపోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న హరికృష్ణ కోసం గాలింపు మొదలుపెట్టారు.