దారుణాలు: ఇటు తమిళనాడు.. అటు కర్నాటక..

శ్రద్ధావాకర్ ఘటన బయటపడిన తర్వాత దేశవ్యాప్తంగా వరుసగా అలాంటిదే మరిన్ని దురాగతకాలు బయటకొస్తున్నాయి. మరికొన్ని కొత్తగా పుట్టుకొస్తున్నాయి. కేవలం 24 గంటల వ్యవథిలో ఇటు కర్నాటక, అటు తమిళనాడులో ఇలాంటి దుర్ఘటనలు వరుసగా జరగడం…

శ్రద్ధావాకర్ ఘటన బయటపడిన తర్వాత దేశవ్యాప్తంగా వరుసగా అలాంటిదే మరిన్ని దురాగతకాలు బయటకొస్తున్నాయి. మరికొన్ని కొత్తగా పుట్టుకొస్తున్నాయి. కేవలం 24 గంటల వ్యవథిలో ఇటు కర్నాటక, అటు తమిళనాడులో ఇలాంటి దుర్ఘటనలు వరుసగా జరగడం బాధాకరం.

గొడ్డలితో ముక్కలు ముక్కలు చేసి..

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్ తాలూకాలో దారుణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల పళని స్వామి తన కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో నరికి చంపేశాడు. మృతుల్లో అతడి భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇతడ ఓ వ్యవసాయ కూలి. మద్యానికి బానిసయ్యాడు. నిత్యం గొడవలు.

దీంతో తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జరిగిన ఘటనలో 9 ఏళ్ల ఓ చిన్నారి మాత్రం కొన ఊపిరితో బయటపడింది. ఆమెకు ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.

తండ్రిని ముక్కలు చేసి బోరుబావిలో..

ఇలాంటిదే మరో ఘటన కర్నాటకలో జరిగింది. రోజూ తాగి ఇంటికొచ్చి వేధిస్తున్న తండ్రిని, కన్నకొడుకు హతమార్చాడు. తర్వాత ముక్కలు చేసి బోరుబావిలో పడేశాడు. కర్నాటకలోని బాగల్ కోట్ లో జరిగింది ఈ ఘటన.

53 ఏళ్ల పరశురామ్, తన 20 ఏళ్ల కొడుకు విఠల్ తో కలిసి ఉంటున్నాడు. విఠల్ తల్లి, సోదరుడు వేరుగా ఉంటున్నారు. పరశురామ్ రోజూ తాగొచ్చి విఠల్ ను నానా మాటలు అనేవాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది.

ఈ వేధింపులు తాళలేక తండ్రిని హత్య చేశాడు విఠల్. తర్వాత ఆ శరీరాన్ని 32 ముక్కలు చేసి, వాటిని తన పొలంలోని బోరుబావిలో పడేశాడు. కొన్ని రోజులుగా కనిపించని పరశురామ్ కోసం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.