పెళ్లి పీట‌ల‌పైన్నే వ‌ధువు…!

విధి వింత నాట‌కం ఆడింది. కాసేప‌ట్లో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన న‌వ వ‌ధువు… పెళ్లి పీట‌ల‌పైన్నే శాశ్వ‌త నిద్ర‌లోకి వెళ్లిపోయింది. విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధుర‌వాడ‌లో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.  Advertisement వ‌రుడు తెలుగు యువ‌త…

విధి వింత నాట‌కం ఆడింది. కాసేప‌ట్లో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన న‌వ వ‌ధువు… పెళ్లి పీట‌ల‌పైన్నే శాశ్వ‌త నిద్ర‌లోకి వెళ్లిపోయింది. విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధుర‌వాడ‌లో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. 

వ‌రుడు తెలుగు యువ‌త అధ్యక్షుడు శివాజీ. తెలుగు యువ‌త అధ్య‌క్షుడు శివాజీ, సృజ‌న‌ల మ‌ధ్య నిన్న(బుధ‌వారం) రాత్రి వివాహం జ‌రిగేలా పెద్ద‌లు నిశ్చ‌యించారు.

ప్రీవెడ్డింగ్ షూట్‌ను సినిమాను త‌ల‌పించేలా చేశారు. ఈ వీడియో ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా వుండ‌గా  వివాహ ముహూర్త స‌మ‌యానికి వ‌రుడు, వ‌ధువు త‌ర‌పు వారు చేరుకున్నారు. క‌ల్యాణ‌మండ‌పం కోలాహ‌లంగా ఉంది. వ‌రుడు, వ‌ధువు పెళ్లి పీట‌ల‌పై చేరుకున్నారు. సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి కార్య‌క్ర‌మాలను పూజారి జ‌రిపిస్తున్నారు.

వ‌ధువు త‌ల‌పై వ‌రుడు జీల‌క‌ర్ర బెల్లం పెడుతుండ‌గా సృజ‌న స్పృహ కోల్పోయింది. పెళ్లీ పీట‌ల‌పై కూలిపోయిన వ‌ధువును కుటుంబ స‌భ్యులు, బంధువులు వెంట‌నే ఆస్పత్నికి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఆస్ప‌త్రికి వెళ్లే లోపే సృజ‌న తుది శ్వాస విడ‌వ‌డంతో విషాదం నెల‌కుంది. 

పెళ్లింట మంగ‌ళ వాయిద్యాలు మోగాల్సిన స‌మ‌యాన‌, చావు డ‌ప్పు తీవ్ర విషాదాన్ని నింపింది. వ‌ధువు గుండెపోటుతో మృతి చెందిన‌ట్టు చెబుతున్నారు.