1971 వార్ సినిమాలో రోహిత్

అందరు హీరోలు ఇప్పుడు పీరియాడిక్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం లో చరణ్, రాధాకృష్ణ తో చేయబోయే సినిమాలో ప్రభాస్, జెర్సీ సినిమాలో నాని, ఇలా ప్రతి ఒక్కరికి ఓ ప్రాజెక్టు వుంది.…

అందరు హీరోలు ఇప్పుడు పీరియాడిక్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం లో చరణ్, రాధాకృష్ణ తో చేయబోయే సినిమాలో ప్రభాస్, జెర్సీ సినిమాలో నాని, ఇలా ప్రతి ఒక్కరికి ఓ ప్రాజెక్టు వుంది. వైవిధ్యమైన సినిమాలు ఎంచుకునే నారా రోహిత్ కూడా ఇప్పుడు అలాంటి ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు.

డైరక్టర్  చెైతన్య 1971 యుద్ధం నేపథ్యంలో ఓ అద్భుతమైన కథ తయారుచేసారట. దాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తన మార్కెట్, ఇలాంటివి చూడకుండా, ఓ మెమరబుల్ సినిమాలా వుండేలా, అన్ని విధాలా క్వాలిటీ ప్రొడెక్ట్ గా వుండేలా చూసేందుకు నారా రోహిత్ తానే నిర్మాతగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

భాగమతి లాంటి సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన, ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేయబోతున్నారు. దాదాపు 15 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. అందువల్ల సినిమాకు మాంచి స్టార్ కాస్ట్, ప్యాడింగ్ సెట్ చేసి, క్రేజీ ప్రాజెక్టుగా తయారు చేయాలని రోహిత్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్లానింగ్ దశలో  వుందీ సినిమా.