21 కోసం పట్టు పడుతున్న కృష్ణవంశీ?

దర్శకుడు కృష్ణ వంశీ చాలా కష్టపడి, రూపొందించిన మల్టీ స్టారర్ నక్షత్రం. ఈ సినిమా అన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయింది. కానీ సరైన డేట్ దొరకడం లేదు. 14న అనుకున్నారు కానీ, కొద్దిగా…

దర్శకుడు కృష్ణ వంశీ చాలా కష్టపడి, రూపొందించిన మల్టీ స్టారర్ నక్షత్రం. ఈ సినిమా అన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయింది. కానీ సరైన డేట్ దొరకడం లేదు. 14న అనుకున్నారు కానీ, కొద్దిగా పనులు వుండడం వలన వీలు కాలేదు.

21న విడుదల చేద్దాం అన్నది కృష్ణ వంశీ సంకల్పం. ఆ డేట్ దాటితే మళ్లీ మంచి డేట్ దొరకదని ఆయన ఆలోచనగా తెలుస్తోంది. 28న సంపత్ నంది-గోపీచంద్ ల గౌతమ్ నంద విడుదలవుతోంది. కాస్త పెద్ద సినిమానే అది. దాంతో పోటీ ఎందుకనుకుంటే, ఆగస్టు లోకి వెళ్లిపోవాలి. కానీ అక్కడా వరుసగా సినిమాలు వున్నాయి.

అందుకే ఈ నెల 21 న విడుదల చేద్దామన్నది కృష్ణవంశీ ఆలోచనగా తెలుస్తోంది. కానీ అదే రోజు మరో మెగా హీరో వరుణ్ తేజ సినిమా వుండడం సమస్యగా మారింది. నక్షత్రంలో సాయి ధరమ్ తేజ వున్నారు.

సుమారు అరగంటకు పైగా అతని పాత్ర వుంటుంది. ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకే రోజా అన్నది సమస్య. అలాగే 14న సందీప్ కిషన్ శమంతకమణి విడుదలవుతోంది. మళ్లీ వారం తిరక్కుండానే అదే హీరో సినిమా వేయడమా అన్నది మరో సమస్య.

కానీ కృష్ణ వంశీ మాత్రం 21నే వేద్దామని అంటున్నారట. ఒకటి రెండు రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.