Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

25 నుంచి కాకినాడలో 'ఉప్పెన'

25 నుంచి కాకినాడలో 'ఉప్పెన'

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా ఈ నెల 25 నుంచి సెట్ మీదకు వెళ్తోంది. కాకినాడ సముద్రతీరంలో సుమారు 40 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా, సింగిల్ షెడ్యూలులో జరుగుతుంది.

డైరక్టర్ సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.

సముద్రం, ఫిషర్ మెన్ బ్యాక్ డ్రాప్ లో కాస్త నేటివ్ అండ్ రప్ లవ్ స్టోరీగా ఉప్పెన సినిమా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. కాకినాడ తీరంతో పాటు, ఒరిస్సా తీరం, విశాఖ తీరంలో కూడా ఈ సినిమా షూట్ వుంటుంది.

ఆ తరువాత హైదరాబాద్ లో కొంత చిత్రీకరణ వుంటుంది. ఈ సినిమాతో మరో మెగా హీరోగా వైష్ణవ్ తేజ్ రంగంలోకి వస్తున్నాడు.  సుకుమార్ రైటింగ్స్ పార్టనర్ షిప్ లో నిర్మించే సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?