Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరుశురామ్ సినిమా గీతాలో కాదా?

పరుశురామ్ సినిమా గీతాలో కాదా?

గీతగోవిందం తరువాత డైరక్టర్ పరుశురామ్ కథలు అల్లుకుంటూ గీతాసంస్థలోనే వున్నారు. గీతాలోనే ఆయన సినిమా అని వినిపిస్తూ వచ్చింది. గీతా సంస్థ మహేష్ తో సినిమా చేసే అవకాశం  వుందని దాని డైరక్టర్ పరుశురామ్ అని వినిపించింది. ఈ మధ్య లేటెస్ట్ గా పరుశురామ్ వెళ్లి మహేష్ బాబును కలిసి కథ గురించి డిస్కస్ కూడా చేసి వచ్చారు. దాంతో గీతా-మహేష్ బాబు-పరుశురామ్ సినిమా పక్కా అని వినిపించింది.

కానీ ఇప్పుడు మాంచి ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమా గీతాలో కాదు. మహేష్-పరుశురామ్ సినిమా వుండొచ్చు కానీ, గీతాలో మాత్రం కాదని తెలుస్తోంది. అయితే గియితే మైత్రీ లో కావడానికి అవకాశం వుంది.

పరుశురామ్ దగ్గర చాలా మంది అడ్వాన్స్ లు వున్నాయని టాక్. అలాంటి అడ్వాన్స్ ల్లో మైత్రీది కూడా ఒకటి. అందువల్ల మహేష్ బాబు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పరుశురామ్-మైత్రీ కాంబినేషన్ లో సినిమా వుండొచ్చు. 

ఇక గీతాలో పరుశురామ్ సినిమా నా? అది ఎప్పుడయినా వుండొచ్చు. ఎవరితోనైనా వుండొచ్చు. ఇది మాత్రం కాదు. అదీ సంగతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?