ఆ ఇద్దరు ఆశలు జోరు మీదే

సందీప్ కిషన్…కుమార్ నాగేంద్ర..ఈ ఇద్దరూ ఇఫ్పుడు ఒకే సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అదే శ్రీ కీర్తి ఫిలింస్ 'జోరు'. కుమార్ నాగేంద్రకు గుండేల్లో గోదారి కాస్త పేరు తెచ్చి పెట్టినా సరైన సినిమాను వెంటనే…

సందీప్ కిషన్…కుమార్ నాగేంద్ర..ఈ ఇద్దరూ ఇఫ్పుడు ఒకే సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అదే శ్రీ కీర్తి ఫిలింస్ 'జోరు'. కుమార్ నాగేంద్రకు గుండేల్లో గోదారి కాస్త పేరు తెచ్చి పెట్టినా సరైన సినిమాను వెంటనే ఇవ్వలేదు. ఇప్పుడు రెండో సినిమా వచ్చింది. తొలిసినిమాలో హీరోగా చేసిన సందీప్ కిషన్ తోనే మరో సినిమా ప్రారంభించి, దాదాపు పూర్తిచేసేసాడు. 

పెద్దసినిమాల తాకిడి చూసుకుని విడుదల చేసే సన్నాహాల్లో వున్నారు. రాశి ఖన్నా (ఊహలు గుసగుసలాడే), అజయ్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ సినిమా అడియో దసరాకు విడుదల కానుంది. పక్కా కమర్షియల్ మాస్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.

అందుకే ఈ సినిమాతో మాంచి కమర్షియల్ బ్రేక్ సాధిస్తానని దర్శకుడు కుమార్ నాగేంద్ర, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రారా కృష్ణయ్యా తరువాత మరో మంచి హిట్ కొడతానని సందీప్ కిషన్ ఆశలు పెట్టుకున్నారు. భీమ్స్ సంగీతం, సన్నీ ఎమ్మార్ ఆర్ ఆర్ అందించారు. ఈ అడియో దసరాకు విడుదలవుతుంది.