ఆ వదిలేసిన సినిమా చైతూకంట

మహేష్ మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా ఆ మధ్య ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అశోక్ నటన అంతగా…

మహేష్ మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా ఆ మధ్య ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అశోక్ నటన అంతగా నచ్చక, సినిమాకు సరిపోడని భావించడంతో నిర్మాత దిల్ రాజు ఆ ప్రాజెక్టును డ్రాప్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమానే హీరో రాజ్ తరుణ్ తో, డైరక్టర్ కృష్ణారెడ్డితో కలిసి చేస్తున్నారని బయటకు వచ్చింది.

అయితే ఈరోజు నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. గల్లా అశోక్ సినిమా డ్రాప్ కావడం, ఆ సినిమా వేరే హీరోతో చేయడం కరెక్ట్ నే అంట. అయితే ఆ కథ రాజ్ తరుణ్ కు వెళ్లలేదట. రాజ్ తరుణ్ తో కృష్ణారెడ్డి అనే డైరక్టర్ తో చేస్తున్న కథ వేరు అంట.

గల్లా అశోక్ కోసం సిద్దం చేసిన ప్రాజెక్టు నాగచైతన్య దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సినిమా డైరక్టర్ శశితో నాగచైతన్యతో ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నామని దిల్ రాజు మీడియాకు చెప్పారు. శశి ఇప్పటికిప్పుడు కొత్త స్క్రిప్ట్ చైతూ కోసం రెడీ చేసేంత వుండి వుండదు. అంటే గల్లా అశోక్ ప్రాజెక్టు రాజ్ తరుణ్ కు కాకుండా నాగచైతన్యకు వచ్చిందన్నమాట.

సెక్సువల్ ఫాంటసీస్.. ఎక్కువ కోరికలు ఇవేనట!

వైఎస్సార్ యాత్ర సినిమాపై డైరెక్టర్ ఏమి చెప్పారంటే