Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆచార్య వైనంలో కొత్త ట్విస్ట్?

ఆచార్య వైనంలో కొత్త ట్విస్ట్?

ఆచార్య నష్టాల కథ సిరీస్ లో రోజుకో వైనం వినిపిస్తోంది. కొత్త కొత్త వార్తలు పుట్టుకు వస్తున్నాయి. ఇటు..అటు మొత్తానికి ఎట్నుంచో అటు నుంచి వార్తలు పుట్టుకు వస్తున్నాయి. ఆచార్య ఎపిసోడ్ లో మెగాస్టార్ 20 కోట్లు వెనక్కు ఇచ్చారని వార్తలు వినిపంచాయి. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఇరవై కోట్లు వెనక్కు ఇచ్చారని వార్తలు బయటకు వచ్చాయి.

కానీ ఇక్కడే గమ్మత్తయిన ట్విస్ట్ వుందని ఇప్పుడు వినిపిస్తోంది. నిజానికి మెగాస్టార్ టెక్నికల్ గా వెనక్కు ఇచ్చినట్లు. కానీ నిజానికి ఇవ్వనట్లు. అదేంటీ తేడా అంటే అక్కడే వుంది అసలు విషయం అంటూ వినిపిస్తోంది. 

సినిమా ప్రారంభమైన తరువాత కొంత మేరకు మెగాస్టార్ కు, ఆ తరువాత రామ్ చరణ్ కు కొంత అని ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు కొంత కొంత అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఇంకొంత ఇద్దరికీ రావాల్సి వుంది. అలాగే కొరటాల కూడా ఖర్చులకు కొంత వాడుకున్నారు.

సినిమా డిజాస్టర్ అయిన తరువాత మెగాస్టార్ కొంత ఇస్తారని నిర్మాత, దర్శకుడు అనుకున్నట్లు బోగట్టా. ఆయన కూడా ఇస్తాననే అన్నారని తెలుస్తోంది. కానీ ఇక్కడే వుంది అసలు కీలకం. 

తనకు ఇంకా కొంత మొత్తం రావాల్సి వుంది కనుక, అందులోంచి 15 లేదా 20 కోట్లు తగ్గించి తీసుకుందామని మెగాస్టార్ అనుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తీసుకున్నదాంట్లోంచి వెనక్కు ఇస్తారమో అని వీళ్ళు భావించారని తెలుస్తోంది.

సో, అక్కడి నుంచి ఇంత వస్తుంది..ఇక్కడ నుంచి అంత వస్తుంది..అన్నీ కలిపి బయ్యర్లకు తీర్చేయచ్చు అనుకున్నారు. కానీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు వీడింది అంటే మెగాస్టార్ అమెరికా నుంచి వెనక్కు వచ్చాక అంట. ఇదీ ఈ రోజుకు ఆచార్య పోస్ట్ రిలీజ్ పోస్ట్ మార్టమ్ లో లేటెస్ట్ అప్ డేట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?