రజనీకాంత్ సినిమాలో సీక్రెట్ హీరోయిన్

రోబోకు సీక్వెల్ గా వస్తోంది 2.0 సినిమా. మొదటి భాగంలో ఉన్న చిట్టి రోబో, సీక్వెల్  లో కూడా ఉంది. ఇక రజనీకాంత్ కూడా అదే పాత్రను పోషిస్తున్నాడు. ఎటొచ్చి హీరోయిన్ మాత్రం మారిపోయింది.…

రోబోకు సీక్వెల్ గా వస్తోంది 2.0 సినిమా. మొదటి భాగంలో ఉన్న చిట్టి రోబో, సీక్వెల్  లో కూడా ఉంది. ఇక రజనీకాంత్ కూడా అదే పాత్రను పోషిస్తున్నాడు. ఎటొచ్చి హీరోయిన్ మాత్రం మారిపోయింది. ఐశ్వర్యరాయ్ స్థానంలో ఎమీ జాక్సన్ ను తీసుకున్నారు. ఈ విషయంలో ఎవరైనా డిసప్పాయింట్ అవుతారేమో అనే అనుమానం మేకర్స్ లో కూడా ఉంది. అందుకే ఐశ్వర్యరాయ్ ను కూడా తీసుకున్నారు. 

అవును.. 2.0 సినిమాలో ఐష్ కూడా ఉంది. మెయిన్ హీరోయిన్ ఎమీ జాక్సన్ అయినప్పటికీ ఓ ఎమోషనల్ సన్నివేశంలో ఐశ్వర్యరాయ్ వస్తుంది. చిట్టి రోబో ఇబ్బందిపడే సన్నివేశంలో ఐష్ వచ్చి, చిట్టీకి మరింత ఉత్సాహాన్నిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా శంకర్ బయటపెట్టాడు. సినిమాలో ఐశ్వర్యరాయ్ ఎంట్రీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని తెలిపాడు.

543 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది 2.0 సినిమా. మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదల చేశారు. ఇక దుబాయ్ లో రిలీజ్ చేయకుండా దాచేసిన ఓ పాటను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత ట్రయిలర్ రిలీజ్ ఉంటుంది. 

అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమాను నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఒకేసారి 14 భాషల్లో రిలీజ్ అవుతోంది 2.0 సినిమా.