Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అజయ్ భూపతికి జాను టెన్షన్

అజయ్ భూపతికి జాను టెన్షన్

శర్వానంద్-సమంతల కాంబినేషన్ లో జాను సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా కు దర్శకుడు ప్రేమ్ కుమార్. కానీ ఆర్ ఎక్స్ దర్శకుడు అజయ్ భూపతికి జాను సినిమా టెన్షన్ గా మారింది. ఈ లింక్ ఏమిటంటే, జాను సినిమాలో జోడీ కట్టిన శర్వా-సమంత లే అజయ్ భూపతి చేయబోయే మహాసముద్రంలో కూడా జోడీ. అయితే సమంత ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కథ కు ఓకె అనేసింది. గతంలో చైతూతో కలిసి చేయాలని అనుకున్నపుడు. కానీ శర్వాతో చేయడానికి ఇంకా ఓకె అనలేదు.

ఇవ్వాళో, రేపో ఓకె చేయాల్సి వుంది. కానీ సమంత కావాలని జాను సినిమా విడుదల తరువాతకు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. జాను క్లిక్ అయితే నాచురల్ గా శామ్ ఓకె అనేస్తుంది. మరోసారి అదే హిట్ పెయిర్  అంటే ఆ కిక్ వేరుగా వుంటుంది కాబట్టి. అలా కాకుండా, ఎక్కడో మిస్ ఫైర్ అయితే మాత్రం శామ్ ఆలోచనలో పడే అవకాశం వుంది.

మహాసముద్రంలో హీరోయిన్ సమంత అయితేనే బాగుంటుంది అన్నది అజయ్ భూపతి ఆలోచన. పైగా శర్వా-శామ్ జోడీ అంటే  సెకెండ్ హీరోకి కూడా ఎవరో ఒకరు రెడీ అంటారు. అందుకే జాను రిజల్ట్ అజయ్ భూపతికి టెన్షన్ అనాలేమో?

కులాలకు సంబంధించి  త్వరలో పుస్తకం రాస్తాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?