Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్‌ మల్టీ స్టారర్‌.. నాగ్‌ స్కెచ్‌.!

అఖిల్‌ మల్టీ స్టారర్‌.. నాగ్‌ స్కెచ్‌.!

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.? అన్న ప్రశ్నకు సమాధానం ఎలాగైతే సస్పెన్స్‌లా మారిందో.. అఖిల్‌ తదుపరి సినిమా ఏంటి.? అనేదానిపైనా అంతే సస్పెన్స్‌ కొనసాగుతోంది. సోషల్‌ మీడియాలో మరీ అఖిల్‌ గురించి ఈ స్థాయిలో కామెడీ జరుగుతోందంటే, అందుక్కారణం అఖిల్‌ మాత్రమే. 

దాదాపు అరడజను మంది డైరెక్టర్లు ఫైనల్‌ అయినట్టే అయ్యి, చేజారిపోయారు. నాగార్జున కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేని పరిస్థితి. అఖిల్‌ తదుపరి సినిమా ఏంటి.? అన్నదానిపై సస్పెన్స్‌ యదాతతంగా కొనసాగుతోంది. తాజాగా విన్పిస్తోన్న ఊహాగానాల్ని బట్టి చూస్తోంటే, అఖిల్‌ తదుపరి సినిమా ఓ మల్టీస్టారర్‌ అట. అందులో అఖిల్‌తోపాటు, తమిళ హీరో కార్తీ నటిస్తాడట. 

నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో 'ఊపిరి' సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆ సినిమా టైమ్‌లోనే వంశీతో అఖిల్‌ సినిమా ఖాయమయ్యింది. కానీ, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్‌ అటకెక్కేసింది. అయితే, కార్తీతో మంచి ర్యాపో వున్న నాగార్జున, అఖిల్‌కి కార్తీని కలిపితే తమిళంలోనూ అఖిల్‌కి గ్రాండ్‌ లాంచ్‌ వస్తుంది, తెలుగులోనూ కార్తీ క్రేజ్‌ని ఉపయోగించుకోవచ్చనే ఆలోచన చేస్తున్నాడట. 

అయితే, నాగార్జున ఎన్ని అనుకున్నా అఖిల్‌ ఓకే చెయ్యొద్దూ.? తండ్రి సూచన మేరకు కార్తీతో కలిసి నటించే విషయాన్ని అఖిల్‌ పరిశీలిస్తున్నప్పటికీ, ఏమో.. ఈ కాంబినేషన్‌ కూడా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు తక్కువ. వర్కవుట్‌ అయితే మాత్రం తమిళంలో అఖిల్‌కి మంచి లాంచ్‌ లభిస్తుందన్నది నిర్వివాదాంశం. కానీ, రెండో సినిమాకే మల్టీస్టారర్‌ అయితే ఎలా.? అన్నదీ అఖిల్‌ వైపు నుంచి వస్తోన్న క్వశ్చన్‌. ఇది కూడా నిజమే కదా.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?