అఖిల్ ఈసారి “మలుపు” తిప్పుతాడా?

హలో సినిమా ప్రమోషన్ లో భాగంగా తన కొత్త ప్రాజెక్టులపై కూడా మాట్లాడాడు అఖిల్. ప్రస్తుతం 2కథలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని, వాటిలోంచి ఓ కథను ఫైనల్ చేసి జనవరి 10న ప్రకటిస్తానని…

హలో సినిమా ప్రమోషన్ లో భాగంగా తన కొత్త ప్రాజెక్టులపై కూడా మాట్లాడాడు అఖిల్. ప్రస్తుతం 2కథలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని, వాటిలోంచి ఓ కథను ఫైనల్ చేసి జనవరి 10న ప్రకటిస్తానని చెప్పాడు. వాటిలో ఒక సినిమా సంగతి ఇప్పుడు బయటకొచ్చింది.

గతంలో మలుపు అనే సినిమా తీసిన సత్య పినిశెట్టి.. అఖిల్ కు ఓ డిఫరెంట్ స్టోరీలైన్ వినిపించాడట. అఖిల్ చెప్పిన 2కథల్లో ఇది కూడా ఒకటి. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ ఈ సినిమానే ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. 

ఇంతకీ ఈ సత్య పినిశెట్టి ఎవరో తెలుసా.. నటుడు ఆది పినిశెట్టికి స్వయానా సొదరుడు. ఒకప్పటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు. దాదాపు నెల రోజులుగా ఇతడితో ట్రావెల్ అవుతున్నాడు అఖిల్. సత్య చెప్పిన స్టోరీపై చాలా సిట్టింగ్స్ నడిచాయి. 

అఖిల్ చెప్పిన రెండు సినిమాల్లో.. ఆ రెండో దర్శకుడు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు అఖిల్ నెక్ట్స్ సినిమాకు నిర్మాత ఎవరనే విషయంపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదటి సినిమాకు అఖిల్ బెస్ట్ ఫ్రెండ్ నితిన్ నిర్మాత. రెండో సినిమాకు అఖిల్ తండ్రి నాగార్జున నిర్మాత. ఇప్పుడు అఖిల్ మూడో సినిమాకు అతడి బంధువు, స్నేహితుడైన రానా నిర్మాతగా మారే అవకాశం ఉందట.