అల్లు అరవింద్‌తోనే ఉంటుందట

చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌ రెండవ చిత్రాలని నిర్మించిన అల్లు అరవింద్‌ కొత్తగా తెరపైకి వచ్చిన నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ రెండో చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారని టాక్‌. ‘ముకుంద’ చిత్రం…

చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌ రెండవ చిత్రాలని నిర్మించిన అల్లు అరవింద్‌ కొత్తగా తెరపైకి వచ్చిన నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ రెండో చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారని టాక్‌. ‘ముకుంద’ చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్‌ అయినా కానీ వరుణ్‌ తేజ్‌కి మాత్రం హీరోగా మంచి పేరొచ్చింది. బ్యాంకబుల్‌ హీరో కాగలడనే నమ్మకాన్ని కలిగించిన వరుణ్‌ తేజ్‌ తన రెండో చిత్రం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. 

మొదటి సినిమాలో కమర్షియల్‌ అంశాలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వరుణ్‌తేజ్‌ చేదు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. రెండవ చిత్రం మాత్రం పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని వరుణ్‌ నిర్ణయించుకున్నాడు. క్రిష్‌ డైరెక్షన్‌లో అతని తదుపరి చిత్రం ఉంటుందని వినిపించినా కానీ ఇప్పుడా ఐడియా డ్రాప్‌ అయినట్టు సమాచారం. 

పూరి జగన్నాథ్‌ లేదా మరెవరైనా దర్శకుడితో పూర్తి స్థాయి కమర్షియల్‌ సినిమానే వరుణ్‌ చేయబోతున్నాడు. దీనిని అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తారో లేక మరో నిర్మాత భాగస్వామ్యంలో చేస్తారో అనేది ఇంకా తెలీలేదు.