మహేష్ బాబు నిజంగా 50 కోట్లు తీసుకున్నాడా?

సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేష్ బాబుకు 50 కోట్లు ఇచ్చారట.. దాదాపు సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి వినిపిస్తున్న పుకారు ఇది. పైగా ఈ సినిమాకు ఆయన భాగస్వామి కూడా కావడంతో 50…

సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేష్ బాబుకు 50 కోట్లు ఇచ్చారట.. దాదాపు సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి వినిపిస్తున్న పుకారు ఇది. పైగా ఈ సినిమాకు ఆయన భాగస్వామి కూడా కావడంతో 50 కోట్లు ఇచ్చే ఉంటారంటూ మరో యాడ్-ఆన్ కూడా వినిపించింది. ఎట్టకేలకు ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యాడు నిర్మాత అనీల్ సుంకర. మహేష్ కు ఇప్పటివరకు డబ్బులే ఇవ్వలేదనేది అనీల్ సుంకర వెర్షన్.

“మహేష్ కు 50 కోట్లు ఇచ్చామనేది గాసిప్ మాత్రమే. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే మహేష్ కు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. కెమెరా ముందు ఓపెన్ గా చెబుతున్నాను, మహేష్ కు ఇప్పటివరకు నేను డబ్బులే ఇవ్వలేదు. ఆయన మా సినిమాలో ఓ భాగస్వామి. మూవీ బాగా ఆడితే అందరికీ మంచి రిటర్న్స్ వస్తాయి.”

ఇలా మహేష్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చాడు అనీల్ సుంకర.  మహేష్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సుంకర, ఈసారి మహేష్ తో సినిమా చేస్తే హిట్ కొట్టాలనే కసితోనే గ్యాప్ తీసుకున్నానని, సరిలేరు నీకెవ్వరు సినిమాతో అభిమానులకు హిట్ ఇస్తానని అంటున్నాడు.

“మహేష్ నాకు చాలా క్లోజ్. కానీ ఏ స్క్రిప్ట్ పడితే అది పట్టుకొని వెళ్లను. మంచి స్క్రిప్ట్ దొరక్కపోతే కలవకూడదని అనుకున్నాను. ఎందుకంటే దూకుడు తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వన్-నేనొక్కడినే కమర్షియల్ గా ఆడలేదు. ఆగడు సినిమా సంగతి కూడా మనందరికీ తెలిసిందే. సో.. నెక్ట్స్ మూవీ తప్పకుండా హిట్ అవ్వాలి. ఫ్యాన్స్ ఒక్కసారి లేదంటే రెండు సార్లు క్షమిస్తారు. ఈసారి మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.”

సరిలేరు నీకెవ్వరు సినిమా 75శాతం షూటింగ్ పూర్తయింది. కొన్ని ఎపిసోడ్స్, మరికొన్ని సాంగ్స్ మాత్రమే పెండింగ్.  ఈ సినిమాకు మహేష్ తో పాటు దిల్ రాజు కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇలా మహేష్, దిల్ రాజు ఇద్దరూ పార్టనర్స్ గా చేరడం తనకు చాలా హ్యాపీగా ఉందని, టెన్షన్ కూడా తగ్గిందని అంటున్నాడు అనీల్ సుంకర.

అల్లువారింట్లో సైరా పార్టీ.. అక్కినేని హీరో కూడా