బాలయ్య..అన్నా చెల్లెళ్ల ఇగో సమస్య

ఇద్దరి మధ్య ఇగో సమస్యతో వచ్చిన సినిమా భీమ్లా నాయక్. బాలయ్య చేస్తున్న సినిమాలో కూడా ఇగో పాయింట్ వుందని వినిపిస్తోంది.  Advertisement అన్న..చెల్లెళ్ల మధ్య వచ్చిన ఇగో వార్ కారణంగా జ‌రిగే కథనే…

ఇద్దరి మధ్య ఇగో సమస్యతో వచ్చిన సినిమా భీమ్లా నాయక్. బాలయ్య చేస్తున్న సినిమాలో కూడా ఇగో పాయింట్ వుందని వినిపిస్తోంది. 

అన్న..చెల్లెళ్ల మధ్య వచ్చిన ఇగో వార్ కారణంగా జ‌రిగే కథనే బాలయ్య-మైత్రీ మూవీస్ సినిమాగా తెరకెక్కుతోందని బాలీవుడ్ వర్గాల బోగట్టా. 

కన్నడ సినిమా ఆధారం అని ఈ మధ్య తెగ వార్తలు వచ్చాయి. కాదని క్లారిటీ కూడా వచ్చింది. ఈ లోగా ఆ కన్నడ సినిమా హక్కులు వేరే వాళ్లు కొనుకున్నారు కూడా.

అన్న చెల్లెళ్ల మధ్య ఇగో వార్ కారణంగా చెల్లెలే అన్నను చంపించేయడం, విదేశాల్లో పెరిగే మేనల్లుడు అయిన హీరోను కూడా చంపించడం కోసం ప్రయత్నించడం వంటి పాయింట్ తో స్వంత కథ అల్లుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

అందువల్లే సినిమా షూట్ కొంత అమెరికాలో వుంటుందని వినిపిస్తోంది. అఖండ సినిమా తరువాత బాలయ్య కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వున్నారు. తన ఇమేజ్ కు, తన ఫ్యాన్స్ ఇంట్రస్ట్ కు సూటయ్యే కథలే ఎంచుకుంటున్నారు.

ఈ సినిమాకు రెడ్డి అని చివర్న వచ్చేలా టైటిల్ అనుకున్నారని, కానీ బాలయ్య వద్దన్నారని వినిపిస్తోంది. అందువల్ల సరైన టైటిల్ కోసం చూస్తున్నారు.