‘బలుపు’ జోడీ మళ్లీ ఫిక్స్

శృతిహాసన్ తెలుగులో చేసిన సినిమాలు అన్నీ దాదాపు హిట్ లే. ఎక్కడో ఒకటి రెండు తప్ప. అయితే ఇటీవల తెలుగుకు దూరం అయ్యింది శృతిహాసన్. ఆమె వ్యవహార శైలి కొంత, ఇతరత్రా వ్యవహారాలతో బిజీ…

శృతిహాసన్ తెలుగులో చేసిన సినిమాలు అన్నీ దాదాపు హిట్ లే. ఎక్కడో ఒకటి రెండు తప్ప. అయితే ఇటీవల తెలుగుకు దూరం అయ్యింది శృతిహాసన్. ఆమె వ్యవహార శైలి కొంత, ఇతరత్రా వ్యవహారాలతో బిజీ కావడం కొంత కలిసి, ఆమె తెలుగు సినిమాలకు దూరం అయింది. అయితే ఇప్పుడు శృతి పూర్తిగా మారిపోయింది అని టాక్. ఫాలో అప్, ఫోన్ ఆన్సర్ లు అన్నీ చాలా పద్దతిగా చేస్తోందని తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు మళ్లీ ఆమె వైపు టాలీవుడ్ జనాల చూపు మళ్లింది. గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో తయారయ్యే మూవీకి శృతిని హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. అగ్రిమెంట్ చేసారు. గతంలో ఇదే కాంబినేషన్ లో బలుపు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ అన్నమాట.

ప్రస్తుతం డిస్కోరాజా సినిమా చేస్తున్నారు రవితేజ. ఆ సినిమా అయిపోగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. గోపీచంద్ మలినేని ఫన్ బాగా పండిస్తారు. కానీ ఈసారి ఆయన సినిమాకు బుర్రా సాయిమాధవ్ పని చేస్తున్నారు. రైటర్ గా అన్నిరకాల ప్రూవ్ చేసుకున్న బుర్రా ఇప్పటివరకు ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. అక్కడ ఇంకా వీక్ గానే వున్నారు. ఈ సినిమాతో ఆ లోటు పూడ్చుకుంటారేమో చూడాలి.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి