బామ్మ ముచ్చట తీర్చేసాడు

సినిమా నటులు అన్నా, సెలబ్రిటీలు అన్నా భయంకరమైన క్రేజ్ వుంటుంది. దానికి వయస్సుతో సంబంధం వుండదు. రాజమండ్రికి చెందిన శతాథిక వృద్దురాలు రేలంగి సత్యవతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఫొటో తీయించుకోవాలని…

సినిమా నటులు అన్నా, సెలబ్రిటీలు అన్నా భయంకరమైన క్రేజ్ వుంటుంది. దానికి వయస్సుతో సంబంధం వుండదు. రాజమండ్రికి చెందిన శతాథిక వృద్దురాలు రేలంగి సత్యవతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఫొటో తీయించుకోవాలని కోరిక. కలిసి మాట్లాడాలని కోరిక.  ఈ సంగతి ఆ నోటా, ఈ నోటా పడి, సోషల్ నెట్ వర్క్ లోకి చేరి, ఆఖరికి వార్తలుగా మారింది.

ఈ సంగతి మహేష్ కు తెలిసిందని, తన మనుషుల ద్వారా ఆమెను తన దగ్గరకు రప్పించి, ఆమెతో ముచ్చటిస్తాడని ఈనెల 7నే గ్రేట్ ఆంధ్రలో వెల్లడించాం. ఆ విధంగానే ఇప్పుడు మహేష్ ఆ వృద్దురాలిని మహర్షి సెట్ లో కలిసారు.

ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి ఆమెకు సంతోషం కలిగేలా చేసారు. ఈస్ట్ గోదావరికి చెందిన మహేష్ అభిమానులు ఈ మీట్ కు సహకరించి, ఆమెను ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వయసు ఎక్కువే అయినా, సత్యవతి ఆరోగ్యంగా వుండడంతో మహేష్ బాబు రాజమండ్రికి డ్రయివర్ ను, కారును పంపారు. బై రోడ్ తీసుకువస్తూ, విజయవాడలో ఒకరోజు రెస్ట్ కు బస ఏర్పాటు చేసారు. ఆ తరువాత ఇక్కడకు తీసుకువచ్చి, ముచ్చటించి కొత్త దుస్తులు అందించారు. ఆమెకు కూడా తన చిన్న నాటి జ్ఞాపకాలు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ముచ్చట్లు మహేష్ తో పంచుకున్నారు.

మహర్షి సినిమా షూట్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది.

ఆర్గానిక్ ఫార్మింగ్, లాభసాటి వ్యవసాయం వంటి వాటిని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డిస్కస్ చేయడం కథలో భాగం కావడంతో, ఆ మేరకు ఆర్ఎఫ్సీలో ఓ భారీ సెట్ వేసి షూట్ చేస్తున్నారు.

బామ్మ ముచ్చట తీర్చనున్న మహేష్

జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్