‘భరత్’ ను మించేలా సూర్య ఫంక్షన్?

భరత్ అనే నేను సినిమా కోసం హైధరాబాద్ ఎల్ బి స్టేడియంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సభకు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. మహేష్…

భరత్ అనే నేను సినిమా కోసం హైధరాబాద్ ఎల్ బి స్టేడియంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సభకు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. మహేష్ బాబు సినిమా మీటింగ్ కు ఎన్టీఆర్ రావడం అన్నది పెద్ద అట్రాక్షన్. అయితే ఇప్పుడు దీనిని మించి సభ చేయాలని నాపేరు సూర్య జనాలు సన్నాహాలు ప్రారభించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రలో ఓ ఈవెంట్, హైదరాబాధ్ లో ఓ ఈవెంట్ చేయాలన్నది నా పేరు సూర్య యూనిట్ ప్లాన్. అయితే ఆంధ్రలో ప్లాన్స్ సంగతి ఎలా వున్నా, హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియం లో మాత్రం ఓ రేంజ్ సభ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విడుదలకు జస్ట్ అయిదారు రోజులకు ముందు  జరిగే ఈ సభకు మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా తీసుకురావాలన్నది నా పేరు సూర్య యూనిట్ ప్రయత్నంగా వున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన సైరా షూట్లో బిజీగా వున్నారు. పైగా 24న బయల్దేరి చిరంజీవి విదేశాలకు వెళ్తున్నారు. అందువల్ల ఈ ఫంక్షనుకు ఆయన రావడం కష్టమే. ఎందుకంటే సూర్య ఫంక్షన్ బహుశా 29న వుండే అవకాశం వుంది.

ఆ సంగతి ఎలా వున్నా, కాస్త గట్టిగానే ఫ్యాన్స్ ను సమీకరించి, గచ్చిబౌలి ఈవెంట్ భారీగా జురపాలన్నది ‘సూర్య’ యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదిలా వుంటే విశాఖ బీచ్ లో నా పేరు సూర్య కోసం బన్నీ అభిమానులు ఓ సైకత శిల్పాన్ని నిర్మించే ఆలోచన లో వున్నట్లు తెలుస్తోంది. ఈ ఇసుక శిల్పం కాస్త భారీగానే వుంటుందని తెలుస్తోంది. ఇది కాక హైదరాబాద్ కన్నా ముందుగా జరిగే సభ గురించి ఇంకా డిస్కషన్లు సాగుతున్నాయి. దీనికి వెన్యూ ఫైనలైజ్ కావాల్సి వుంది. ఎందుకంటే 15 దాటే వరకు సూర్య షూట్ వుంది. అందువల్ల ఇక చేయడం కష్టమే కావచ్చు.