చైతన్య సినినిమాకు బాలయ్య బాబు

అక్కినేని నాగ్ చైతన్య నటించిన యుద్ధం శరణం సినిమా ఈ వారం విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల కళాశాల్లలో ఈ సినిమా కోసం డిఫరెంట్ పబ్లిసిటీ నిర్వహించి, మాంచి బజ్ తెచ్చారు. అంతకన్నా బజ్ తెప్పించే…

అక్కినేని నాగ్ చైతన్య నటించిన యుద్ధం శరణం సినిమా ఈ వారం విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల కళాశాల్లలో ఈ సినిమా కోసం డిఫరెంట్ పబ్లిసిటీ నిర్వహించి, మాంచి బజ్ తెచ్చారు. అంతకన్నా బజ్ తెప్పించే విషయం ఏమిటంటే, అక్కినేని వారసుడి సినిమాను, నందమూరి వారసుడు బాలయ్య బాబు ఫ్యామిలీతో కలిసి చూడబోతుండడం. 

నిర్మాత సాయి కొర్రపాటికి బాలయ్య బాబు అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. అందుకే బాలయ్య బాబు ఫ్యామిలీ సమేతంగా ప్రసాద్ ల్యాబ్ లో యుద్ధం శరణం సినిమాను ఈ సాయంత్రం చూడబోతున్నారు.

ఇదిలా వుంటే తన కొడుకు చైతన్య నటించిన సినిమాను అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీతో అన్నపూర్ణ స్టూడియోస్ లోని ప్రివ్యూ థియేటర్ లో చూడబోతున్నారు. అది కూడా ఈ సాయంత్రమే. 

మొత్తం మీద నందమూరి, అక్కినేని హీరోలు ఒకేసారి ఒకే టైమ్ లో ఒకే సినిమాను రెండు చోట్ల చూడబోతున్నారు.