హైదరాబాద్ లో శ్రద్ధాకపూర్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ టాలీవుడ్ కు వచ్చేసింది. మరో పది పదిహేను రోజుల్లో స్టార్ట్ కాబోయే సాహో షెడ్యూల్ లో హీరో ప్రభాస్ తో కలిసి నటించేందుకు రెడీ అయిపోతోంది. తెలుగు భాషతో…

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ టాలీవుడ్ కు వచ్చేసింది. మరో పది పదిహేను రోజుల్లో స్టార్ట్ కాబోయే సాహో షెడ్యూల్ లో హీరో ప్రభాస్ తో కలిసి నటించేందుకు రెడీ అయిపోతోంది. తెలుగు భాషతో అస్సలు పరిచయం లేనందున, ఇంగ్లీషు లేదా హిందీలో రాసుకుని పలకడానికి వీలుగా ప్రాక్టీస్ ప్రారంభించేసింది.

మామూలుగా అయితే రెండు రోజుల ముందు వస్తే సరిపోయేది. కానీ ఈ రిహార్సల్ కోసం పది రోజుల ముందుగా వచ్చింది శ్రద్దా కపూర్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో పలు భాషల్లో నిర్మించే సాహో సినిమాకు కాస్త భారీ తారాగణమే వుంది.

ఇప్పటికి అయితే ప్రభాస్, శ్రద్ధాకపూర్, జాకీషరాఫ్ తదితరులు ఎంపికయ్యారు. బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్ త్రయం సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జేమ్స్ బాండ్ తరహాలో భారీ సిజి వర్క్ తో వుంటుంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తారు.