నాగచైతన్య ‘ఆటో’కి రెడ్‌ సిగ్నల్‌.!

ఏ ముహూర్తాన ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమాకి శ్రీకారం చుట్టారోగానీ, ఆ సినిమా విడుదలయ్యేందుకు నానా తంటాలూ పడ్తోందిప్పుడు. సమంత, నాగచైతన్య జంటగా నటించిన ఈ చిత్రానికి దేవ్‌ కట్టా దర్శకుడు. ఆర్థిక ఇబ్బందులే సినిమా…

ఏ ముహూర్తాన ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమాకి శ్రీకారం చుట్టారోగానీ, ఆ సినిమా విడుదలయ్యేందుకు నానా తంటాలూ పడ్తోందిప్పుడు. సమంత, నాగచైతన్య జంటగా నటించిన ఈ చిత్రానికి దేవ్‌ కట్టా దర్శకుడు. ఆర్థిక ఇబ్బందులే సినిమా విడుదలకు అడ్డంపడ్డాయన్న ప్రచారం చాన్నాళ్ళుగా జరుగుతోంది. ఎలాగోలా ఆ ఇబ్బందులు తొలగించుకుని ఈ నెల 27న సినిమా విడుదలకు సిద్ధమవుతోందనగా మళ్ళీ సినిమా రిలీజ్‌కి ఆటంకం ఏర్పడింది.

గుంటూరుకు చెందిన ఎమరాల్డ్‌ సంస్థ అధినేత, తన వద్ద రెండు కోట్లు అప్పుగా తీసుకుని, చెల్లించలేదంటూ ‘ఆటోనగర్‌ సూర్య’ చిత్ర నిర్మాతపై కోర్టుకెక్కారు. దాంతో, న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్‌ వేసింది. జులై 10వ తేదీ వరకూ సినిమా విడుదల చెయ్యొద్దని న్యాయస్థానం చిత్ర నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసింది.

సినిమా టీజర్‌ ప్రామిసింగ్‌గా వున్నా, సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నా, సకాలంలో విడుదలకు నోచుకోకపోవడం వల్ల సినిమాపై అంచనాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కాస్తా లీగల్‌ ఇబ్బందులుగా మారిన దరిమిలా, సినిమా ఎప్పటికి విడుదలవుతుందో ఏమో ఎవరికీ అర్థం కావడంలేదు.