Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూకు ఆ ముగ్గురూ నో చెప్పారట

చైతూకు ఆ ముగ్గురూ నో చెప్పారట

నాగ్ చైతన్య-చందు మొండేటి సినిమాలో స్పెషల్ నెంబర్ గా 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' పాటను రీమిక్స్ చేస్తున్నారని తెలిసిందే. ఆ పాటకు రకుల్, కాజల్ ను ట్రయ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వున్నట్లుండి నిన్నటికి నిన్న తమన్నా పేరు తెర మీదకు వచ్చింది. అయితే దీని వెనుక ఆసక్తి కరమైన విషయాలున్నట్లు తెలుస్తోంది.

చైతూ-చందు మొండేటి సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఏ హీరోయిన్ కూడా ఒక అంతట సెట్ కాలేదని వినిపిస్తోంది. ముందుగా రకుల్ అనుకున్నారు. కానీ ఐటమ్ సాంగ్ లో కాస్త డిఫరెంట్ డ్యాన్స్ మువ్ మెంట్ అనుకుని, ఆమె సెట్ కాదని పక్కన పెట్టారు. కాజల్ ను అడిగారు. ఆమె సింపుల్ గా నో అని చెప్పేసింది.

ఆ వెంటనే రాశీఖన్నాను అడిగారు. ఆమె కూడా నో.. అంటే నో నే అనేసింది. సరే, మైత్రీ బ్యానర్ లోనే చేస్తున్నారు కదా అని ఇలియానాను అడిగారు. ఆమె కూడా చేస్తే హీరోయిన్ గా చేస్తా తప్ప, ఇలా ఐటమ్ లు చేయను అని ఖరాఖండీగా చెప్పేసింది.

దాంతో కాజల్, రాశీఖన్నా, ఇలియానా ముగ్గురూ చైతూతో డ్యాన్స్ కు నో అనేసినట్లు అయింది. అందుకే శృతి హాసన్ ను కూడా అడిగారు. ఆమె తెలివిగా ఎస్, నో చెప్పకుండా అబేయన్స్ లో వుంచింది.

ఇక ఇలాంటి అయిటమ్ లకు రెడీగా వుండే తమన్నానే మిగిలింది. కానీ ఇప్పటికే తమన్నా చాలా ఐటమ్ సాంగ్ లు చేసేసింది. కానీ ఏం చేస్తారు? ఎవరూ చేయమని అంటుంటే, ఇంకేం చేయాలి? తమన్నాతో అడ్జస్ట్ అయిపోవడమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?