Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుకుమార్ కు 18కోట్లు, లాభంలో వాటా?

సుకుమార్ కు 18కోట్లు, లాభంలో వాటా?

ఇప్పుడు టాలీవుడ్ లో డైరక్టర్ల టైమ్ నడుస్తోంది. రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి ఇలా టాప్ లైన్ డైరక్టర్లు అంతా కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న వారే.

ఇప్పుడు టాప్ డైరక్టర్ల రెమ్యూనిరేషన్ 10కోట్ల నుంచి 20కోట్ల మధ్య వుంది. రాజమౌళి. కొరటాల శివ లాంటి వారు ప్రాఫిట్ లో షేర్ కూడా తీసుకుంటున్నారు.

ఇప్పుడు ఈ బాటలోకే అడుగుపెట్టేసారు సుకుమార్ కూడా. రంగస్థలం సినిమాతో సుకుమార్ ఒక్కసారి మళ్లీ తన మెరుపు చూపించారు. ఆ సినిమా ఇప్పటికీ షేర్ రాబడుతోంది. అందుకే అదే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, హీరో మహేష్ బాబుతో కలిసి సుకుమార్ తో సినిమా తలపెట్టింది.

ఈ సినిమాకు సుకుమార్ కు 18కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తూ, లాభాల్లో కొంత వాటా కూడా ఇవ్వడానికి మైత్రీ మూవీస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సుకుమార్ కూడా దాదాపు కొరటాల శివ రేంజ్ పారితోషికం అందుకుంటున్నారన్నమాట.

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా చేయాల్సి వుంది. ఆ తరువాత సుకుమార్ సినిమా వుంటుంది. గతంలో మహేష్ బాబుతో ఓ డిజాస్టర్ అందించిన సుకుమార్ ఈసారి సూపర్ హిట్ ఇవ్వాలని పంతంగా వున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?