Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చెక్కిందే చెక్కుతున్న డైరక్టర్ ?

చెక్కిందే చెక్కుతున్న డైరక్టర్ ?

కొంత మంది డైరక్టర్లు పెర్ ఫెక్షన్ కు పెట్టింది పేరు. వాళ్లు అలా చెక్కుతూనే వుంటారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా అదే పని చేస్తున్నారు. చైతూ-సాయి పల్లవి ల లవ్ స్టోరీని రీషూట్ చేయడమే కాదు, చాలా సీన్లు ఒకటి మూడు ఫ్రేమ్ లు తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కోటీ మ్యాచ్ చేసి ఏది మ్యాచ్ అవుతుందా అని కిందా మీదా లెక్కలు వేస్తున్నారు. దీంతో ఖర్చు అలా అలా పెరుగుతూ పోతోంది. దీనికి తోడు కరోనా ఖర్చులు అదనం. 

ఏమైతేనేం ప్రస్తుతానికి లవ్ స్టోరీ ఓ సాంగ్, కొంత షూట్ బకాయి అనే స్టేజ్ కు వచ్చింది. ఒక నెలలోపే పూర్తి అవుతుందని టాక్. అన్నీ బాగుండి దీపావళికి జనాలు థియేటర్లకు వస్తే లవ్ స్టోరీ క్రిస్మస్ కు వస్తుంది. లేదా వకీల్ సాబ్ లేదూ అనుకుంటే సంక్రాంతికి వస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి అయితే నిర్మాత ఆసియన్ సునీల్ సినిమా విడుదల డేట్ మీద ఏ క్లారిటీ పెట్టుకోలేదు. ముందు సినిమా ఫినిష్ అయితే, మార్కెట్ పరిస్థితి చూసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. శేఖర్ కమ్ములతో మరో సినిమా కూడా ఇదే బ్యానర్ లో వుంది. 

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?