చేతులు మారిన సీటీమార్

సీటీమార్..సంపత్ నంది-గోపీచంద్ కాంబినేషన్ లో తయారైన పక్కా మాస్ యాక్షన్ సినిమా. తమన్నా అందాలు ఆరబోసిన సినిమా. ఇప్పటికే ఈ సినిమాలో జ్వాలా రెడ్డీ పాట బాగా పాపులర్ అయింది. Advertisement కరోనా సెకెండ్…

సీటీమార్..సంపత్ నంది-గోపీచంద్ కాంబినేషన్ లో తయారైన పక్కా మాస్ యాక్షన్ సినిమా. తమన్నా అందాలు ఆరబోసిన సినిమా. ఇప్పటికే ఈ సినిమాలో జ్వాలా రెడ్డీ పాట బాగా పాపులర్ అయింది.

కరోనా సెకెండ్ ఫేజ్ రావడానికి చాలా కాలం ముందే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. నైజాం ఏరియాను మాంచి ఫ్యాన్సీ రేట్ కు వరంగల్ శ్రీను తీసుకున్నారు. అలాగే ఎక్కడిక్కడ బిజినెస్ జరిగిపోయింది. 

కానీ వకీల్ సాబ్ అడ్డం పడడం, కరోనా రెండో ధశ రావడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇలాంటి నేపథ్యంలో సినిమాను ఓటిటికి ఇచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. జరుగుతున్నాయి కూడా. అందుకోసం నైజాం ఏరియాను వరంగల్ శ్రీను నుంచి వెనక్కు తీసుకున్నారు. ఓటిటికి వెళ్తుంది కాబట్టి, ఎన్ ఓ సి ఇచ్చేయక తప్పలేదు.

కానీ కట్ చేస్తే, ఇప్పుడు ఓటిటి ఆలోచనలను పక్కన పెట్టి నైజాం ఏరియాను దిల్ రాజు చేతిలో పెట్టారు. నైజాంలో దిల్ రాజుకు-వరంగల్ శ్రీనుకు చుక్కెదురు అన్నది అందరికీ తెలిసిన సంగతే. ఇలా తన దగ్గర నుంచి తీసుకుని, దిల్ రాజు చేతిలో పెట్టడంతో వరంగల్ శ్రీను షాక్ అయ్యారు. నిజంగా ఓటిటికి ఇచ్చే ప్రయత్నంలో తన దగ్గర నుంచి తీసుకున్నారా? లేక దిల్ రాజుకు ఇవ్వడం కోసం తన దగ్గర ఓటిటి అని చెప్పి తీసుకున్నారా? అన్నది వరంగల్ శ్రీను జవాబు కోసం వెదుకుతున్న ప్రశ్నలు.