దానయ్యపై చరణ్.. అలక.. ఆగ్రహం?

హీరో రామ్ చరణ్ నిర్మాత దానయ్యపై అలిగారా? ఆగ్రహించారా? బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయబోతున్నారు నిర్మాత దానయ్య, హీరో రామ్ చరణ్ తో. ఒకటి ఆల్రెడీ సెట్ మీద వుంది బోయపాటి…

హీరో రామ్ చరణ్ నిర్మాత దానయ్యపై అలిగారా? ఆగ్రహించారా? బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయబోతున్నారు నిర్మాత దానయ్య, హీరో రామ్ చరణ్ తో. ఒకటి ఆల్రెడీ సెట్ మీద వుంది బోయపాటి డైరక్షన్ లో. మరొకటి సెట్ మీదకు వెళ్లాలి రాజమౌళి డైరక్షన్లో. ఇలాంటి టైమ్ లో ఆ హీరో నిర్మాత మీద అలగడం, ఆగ్రహించడం అంటే కాస్త ఆసక్తికరమే.

విషయం ఏమిటంటే, రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఇప్పటికి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెట్టుబడి పెట్టిన ప్రతి బయ్యర్ కు రూపాయికి రూపాయిన్నరకు పైగా తెచ్చింది. ఇంకా తెస్తోంది. ఇలాంటి టైమ్ లో దానయ్య నిర్మాతగా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వచ్చింది. అది కూడా మంచి హిట్ అయింది. కానీ ఎక్కడ జరుగుతోందో? ఎందుకు జరుగుతోందో? తెలియదు కానీ, ఆ సినిమా కలెక్షన్లను రోజు రోజుకు జంప్ చేయిస్తూ రెండు వందల కోట్ల పోస్టర్ వేసే దిశగా ప్రచారం చేసేసారు. రెండు వారాల్లో రెండు వందల గ్రాస్ అంటూ హల్ చల్ చేయబోయారు.

మరోపక్క మహేష్ తో వున్న సంబంధాల రీత్యా రంగస్థలం నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేసింది. నిర్మాతలు ఓవర్ సీస్ కు వెళ్లిపోయి, ఇక్కడ ప్రచారాన్నివదిలేసారు. సినిమా మంచి షేర్ వస్తున్న టైమ్ లో ప్రచారం వదిలేయడం కేవలం మహేష్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, ఆయనతో తరువాత సినిమా చేయాల్సి వుండడం వల్లే అని ఫ్యాన్స్ రామ్ చరణ్ దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో దానయ్య తన భరత్ అనే నేను సినిమాకు రెండు వారాలు-రెండు వందల కోట్లు అన్న పోస్టర్ వేయబోతున్నారని కూడా చరణ్ కు తెలిసిందట.

దీంతో చరణ్ వెంటనే దానయ్యకు ఫోన్ చేసి కాస్త గట్టిగానే మాట్లాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమైన కలెక్షన్లు ఎంతవుంటే అంతా వేసుకోవచ్చని, తప్పులేదని, కేవలం తన సినిమాను దాటించడం కోసం లేని కలెక్షన్లతో పోస్టర్ లు వేయడం అభిమానులను బాధపెట్టడం అవుతుందని ఫుల్ గా క్లాస్ పీకారట. అంతేకాదు, ఆ తరువాత నిర్మాత మీద అలిగి రెండురోజుల పాటు చరణ్ షూటింగ్ కు కూడా డుమ్మా కొట్టారని తెలుస్తోంది.

దాంతో 200కోట్ల పోస్టర్ వేసే ఆలోచన ఆపేసి, 190.63 కోట్ల పోస్టర్ ను విడుదల చేసారని తెలుస్తోంది. కానీ ఇప్పటికి మైత్రీ పబ్లిసిటీని వదిలేసిన వ్యవహారం మీద, దానయ్య చేస్తున్నప్రచారం మీద చరణ్ గుర్రుగా వున్నారని వినికిడి.