దర్శకేంద్రుడు-కొత్త సినిమా

ఆంధ్రలో వైకాపా ప్రభుత్వం రావడంతో తన వయోభారం గుర్తుకు వచ్చింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు. అందుకే తెదేపా ప్రభుత్వం ఇచ్చిన పదవిని వదిలేసారు. కానీ ఖాళీగా వుండలేరు కదా? అందుకే మళ్లీ కొత్త సినిమా ప్రకటించారు.…

ఆంధ్రలో వైకాపా ప్రభుత్వం రావడంతో తన వయోభారం గుర్తుకు వచ్చింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు. అందుకే తెదేపా ప్రభుత్వం ఇచ్చిన పదవిని వదిలేసారు. కానీ ఖాళీగా వుండలేరు కదా? అందుకే మళ్లీ కొత్త సినిమా ప్రకటించారు. దీనికి వయోభారం అడ్డంరాదేమో? ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లు, ఒక్క హీరో అంటూ సినిమా ప్రకటించారు. హీరో ఎవరు అన్నది సస్సెన్స్ అంట.

బాహుబలి నిర్మాతలుగా పేరున్న శోభ, ప్రసాద్ లు నిర్మాతలు. మరి ముగ్గురు దర్శకుల్లో తన పేరు, తన కొడుకు ప్రకాష్ పేరులు కూడా వుంటాయో, వుండవో తెలియాల్సి వుంది. రాఘవేంద్రరావు సంగతి ఎలా వున్నా, శోభు, ప్రసాద్ లు నిర్మాతలు అంటే ఏ హీరో అయినా కాదని అనరు. కానీ ఇప్పుడు ఏ హీరో కూడా ఖాళీలేరు.

అందువల్ల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అంటూ ప్రకటించిన సినిమా కార్యరూపం దాల్చాలంటే మాత్రం చాలా సమయమే పడుతుందని అనుకోవచ్చు. అలాగే టీటీడీ భక్తి చానెల్ పదవి వదిలేసినా, రాఘవేంద్రరావు సినిమాల్లో మళ్లీ బిజీ అని అనుకోవాలనీ కావచ్చు.

రిలేషన్ షిప్స్ లో సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇవి!