ఎవరి సమాధి? ఎవరు అలంకరించాలి?

ఎన్టీఆర్ సమాధిని అలంకరించలేదు. జూనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది. నిజానికి ఎవరి ఇల్లు ఎవరు అలంకరించాలి. అంతమంది కొడుకులు వున్నారు. తమ తండ్రి సమాధిని, ఆయన జయంతి రోజున అలంకరించాలన్న ఇంగిత జ్ఞానం…

ఎన్టీఆర్ సమాధిని అలంకరించలేదు. జూనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది. నిజానికి ఎవరి ఇల్లు ఎవరు అలంకరించాలి. అంతమంది కొడుకులు వున్నారు. తమ తండ్రి సమాధిని, ఆయన జయంతి రోజున అలంకరించాలన్న ఇంగిత జ్ఞానం వారికి వుండాలిగా? ఎంత మాజీ ముఖ్యమంత్రి అయితే అన్నీ ప్రభుత్వమే చేయాలా? ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకు హైదరాబాద్ నడిబొడ్డున సమాధులు వున్నాయి?

ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే, ఎఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, భానుమతి లాంటి హేమాహేమీల వంటి వారే కదా? ఎన్టీఆర్ కూడా. మరి వారికి సమాధులు వున్నాయా? హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ సమాధి వుంది. అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ వుంది కనుక భారీగా కట్టేసారు. ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే ఎఎన్నార్, సావిత్రి, భానుమతి మాదిరిగా పాపులర్ నటుడు మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు నగరం నడిబొడ్డున సమాధికి స్థలం లభించింది.

నిజానికి జంటనగరాల్లో ఎన్టీఆర్ సంపాదించిన స్థలాలు ఇన్నీ అన్నీ కావు. మనవలు, ముని మనవల వరకు సరిపోయేటన్ని. అలా అంటే అభిమానులకు కోపం తన్నుకు వచ్చేస్తుంది. ప్రభుత్వం దగ్గర స్టూడియో కోసం స్థలం తీసుకున్నారు కూడా. సరే ఇదంతా వేరే సంగతి.

ఎన్టీఆర్ సమాధిని ఎవరు అలంకరించాలి? ప్రభుత్వమా? సరే ఆ సంగతి అలావుంచితే ఎన్టీఆర్ కొడుకులకు తమ తండ్రి సమాధిని జయంతి సందర్భంగా అలంకరించాలన్న ఆలోచన వుండాలి కదా? అందరూ మళ్లీ కోట్లకు పడగలెత్తిన వారే. వెయ్యి రూపాయల పూలు పెడితే సమాధి నిండిపోతుంది.

ఎన్టీఆర్ కొడుకు ఎమ్మెల్యే, అల్లుడు మాజీ ముఖ్యమంత్రి, మనవడు టాప్ హీరో… ఇలా అందరూ అంతోఇంతో లైమ్ లైట్ లో వున్నవారే. చేయాల్సింది చేయడం మానేసి, సమాధి ఇలాగా వుండేది? ఇకపై నేనే చూసుకుంటా అని జూనియర్ ఎన్టీఆర్ చిర్రుబుర్రులాడడం ఎందుకో? 'అయ్యో, మరిచిపోయామే'అని గమ్మున వుండాలి కానీ.

ఎన్టీఆర్ ఇచ్చిన అపార ఆస్తిపాస్తులను అనుభవిస్తున్నవారే ఆయన సమాధిని పట్టించుకోకుంటే, వేరే వాళ్లకు ఎందుకు పడుతుంది? ఎందుకు పట్టాలి? ఏదో లాంఛనాన్ని కాస్త తుడిచి, నాలుగు పువ్వులు పెడతారు తప్ప, శోభాయమానంగా ఎందుకు అలంకరిస్తారు?

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ నివాళులు అర్పించిన ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

రిలేషన్ షిప్స్ లో సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇవి!