ఓటీటీ సంస్థ డిసైడ్ చేస్తోంది..!

టాలీవుడ్ నిర్ణయాలను ఓటీటీ సంస్థలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఏ సినిమా ఎప్పుడు విడదుల చేయాలన్నది ఇప్పుడు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. హరి హర వీర మల్లు సినిమా ఈ నెల 30 విడుదల కావాల్సి వుంది. కానీ ఇప్పటికే అదే డేట్ కు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ప్లాన్ చేసి వుంది. పోనీ మారుద్దామని హరి హర వీరమల్లు అనుకున్నా నిర్ణయం నిర్మాత ఎఎం రత్నం చేతిలో లేదట. ఎందుకంటే సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ చేతిలో వున్నాయి. మే 30 నుంచి విడుదల మార్చాలంటే అమెజాన్ ఓకె అనాల్సి వుంది.

ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులతో మాట్లాడడానికి నిర్మాత ఎ ఎమ్ రత్నం ముంబాయి వెళ్తున్నట్లు సమాచారం. అమెజాన్ అంగీకరిస్తే జూన్ 15 టైమ్ లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఒక వేళ అమెజాన్ డేట్ మారిస్తే తాము వెనక్కు వెళ్తామని చెబితే మాత్రం మే 30 విడుదల చేయక తప్పదు. అమెజాన్ ను ఒప్పిస్తాననే ధీమాతో ఏ ఎమ్ రత్నం వున్నారని తెలుస్తోంది.

రాను రాను ఓటీటీ కండిషన్లు పెరుగుతున్నాయి. భారీ వ్యయంతో నిర్మించిన ఓ మిడ్ రేంజ్ సినిమా విడుదలకు కిందా మీదా అవుతోంది. ఆ సినిమా నిర్మాత అమెజాన్ ను సంప్రదిస్తే మూడు వారాలకు బ్రాడ్ కాస్ట్ అయ్యేలా అగ్రిమెంట్ ఇస్తే కొంటామన్నారట. అలా అని ఎక్కువ ప్రయిస్ ఏమీ ఆఫర్ చేయలేదు. మూడు వారాలకు అగ్రిమెంట్ తో పాట వాళ్లు చెప్పిన డేట్ కే విడుదల అన్నది మరో కండిషన్. దాంతో ఏం చేయాలో తోచక తల పట్టుకున్నారు నిర్మాత.

మొత్తం మీద చూస్తుంటే, టాలీవుడ్ నిర్ణయాలను ఓటీటీ సంస్థలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.

9 Replies to “ఓటీటీ సంస్థ డిసైడ్ చేస్తోంది..!”

  1. పవన్ కళ్యాణ్ సినిమాకి పవన్ ఫాన్స్ కన్నా కూడా మీకే ఆసక్తి ఎక్కువ… అమెజాన్ ప్రైమ్ వారు చెప్పారా? లేక ఏ ఎం రత్నం గారు చెప్పారా? మూడు వారాల్లో ott రిలీజ్ అని, సినిమా రిలీజ్ అయ్యే దాకా ఇలానే ఏదో రకంగా ఏడుస్తూ ఉంటారు…. సినిమా రిలీజ్ అయ్యాక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్స్ ఎన్ని వచ్చ్చాయో చెప్తారు…. అదే సీన్ రిపీట్….

  2. మహానేత హయాం లో జరిగిన గాలి జనార్ధన్. గనుల మాయం .లో. కేసు కు 7 ఏళ్లు విధించారు.  తెలియనట్లు యాక్ట్ చేద్దాం

  3. మీ అన్నియ్య మీద కూడా ఇంత శ్రద్దగా రాయవు కదా GA,  నువ్వు నీ ఏడుపు రాతలు 

Comments are closed.