Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డేట్ లు మారిపోతాయా?

డేట్ లు మారిపోతాయా?

జనవరిలో సినిమాల తాకిడి ఎక్కువగానే వుంది. పండగకు ఎన్టీఆర్ బయోపిక్, వినియ విధేయ రామ, ఎఫ్ 2 ఫిక్స్ అయ్యాయి. వాటితో పాటు రజనీకాంత్ 'పేటా' కూడా వస్తుందని టాక్ వుంది. అందుకే తెలుగు సినిమాలు కొన్ని జనవరి 25కు ఫిక్స్ అయ్యాయి. కళ్యాణ్ రామ్ 118, అఖిల్ మిస్టర్ మజ్ఞు, నిఖిల్ ముద్ర వీటిలో కొన్ని.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా పేటా కొంచెం వెనక్కు వెళ్తుందని వినిపిస్తోంది. జనవరి 25కు వెళ్లవచ్చని బోగట్టా. అదేకనుక జరిగితే మళ్లీ ముందుగా షెడ్యూలు చేసుకున్న సినిమాలు మారే అవకాశం వుంది. నిఖిల్ ముద్ర డేట్ జనవరి 25 కు, ఫిబ్రవరి 1కి మధ్య డిస్కషన్లలో వుంది.

ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ బయోపిక్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అంటున్నారు. అందువల్ల జనవరి 25 నుంచి వెనక్కు వెళ్లడానికి కూడా అంతగా చాన్స్ లేదు. ఇధిలా వుంటే కార్తీ దేవ్, టెంపర్ హీందీ రీమేక్ సింబ కూడా డిసెంబర్ ఎండ్ నుంచి జనవరి ఎండ్ మధ్యలో రానున్నాయి.

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?