Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్రిష్-వరుణ్ తేజ్ చిత్రానికి దిల్ రాజు క్రేజీ ఆఫర్!

క్రిష్-వరుణ్ తేజ్ చిత్రానికి దిల్ రాజు క్రేజీ ఆఫర్!

దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డితో కలిసి తాను కూడా నిర్మాతగా వ్యవహరిస్తూ వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఘాజీ’ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ కబుర్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

ఈనెలలో ప్రారంభం అవుతుందని అనుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే ఓవర్సీస్ బిజినెస్ పూర్తయిపోయింది. నిర్మాతగా అయినా సరే క్రిష్ ముద్ర ఉంటే గనుక.. ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని అప్పుడే 2.75 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ అమ్మేశారు.

అలాగే టోటల్ ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు 18కోట్లు ఆఫర్ చేస్తున్నట్లుగా వినవస్తోంది. సంకల్ప్ రెడ్డి ఘాజీ చిత్రంతో రానాకు మెమరబుల్ సినిమా అందించి తాను కూడా విమర్శకుల ప్రశంసలు పొందగలిగాడు.

ఇంచుమించుగా అదే తరహాలో.. పూర్తి సీరియస్ కథాంశంతోనే వరుణ్ తేజ్ తో చిత్రాన్ని కూడా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. నిశ్చయంగా ఇంతమేర కమర్షియల్ సక్సెస్ ఉంటుందని ఎవ్వరూ అంచనా వేయలేని పరిస్థితే అయినా.. దిల్ రాజు 18కోట్ల ఆఫర్ ఇవ్వడం విశేషమే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అలాగే, జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తన దర్శకత్వంలో ‘ఆయుష్మాన్ భవ’ అనే చిత్రం చేయబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి నటీనటులు ఇతర వివరాలు ఏవీ బయటకు రాలేదు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ లేదా రవితేజ హీరోగా చేయాలని క్రిష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావచ్చునని సమాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?