ఆ డైలాగ్ ఎవరిపై?

పాండవులు పాండవులు తుమ్మెద ట్రయిలర్ విడుదలయింది. దాని సంగతి ఎలా వున్నా అందులో వున్న డైలాగ్ ఒకటి మాత్రం చాలా ఆసక్తికరంగా వుంది. మోహన్ బాబు , చాలా సీరియస్ గా..’తప్పు చేసినవాడు ఎవడైనా…

పాండవులు పాండవులు తుమ్మెద ట్రయిలర్ విడుదలయింది. దాని సంగతి ఎలా వున్నా అందులో వున్న డైలాగ్ ఒకటి మాత్రం చాలా ఆసక్తికరంగా వుంది. మోహన్ బాబు , చాలా సీరియస్ గా..’తప్పు చేసినవాడు ఎవడైనా శిక్షింప పడాల్సిందే..అది ఎవరి కొడుకైనా, నా కొడుకులైనా’ అని అనడాన్ని కొన్నాళ్ల క్రితం జరిగిన రామ్ చరణ్ ఉదంతానికి ముడిపెట్టి చూస్తున్నారు. 

ఐటి ఉద్యోగులపై రామ్ చరణ్ అండ్ కొ దౌర్జన్యం చేయడం, అది అలా నీరుకారడం తెలిసిందే. దీని వెనుక చిరంజీవి హస్తం వుందని విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఈ డైలాగ్ దాని నేపథ్యంలోనే అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. 

సినమాలో డైలాగు ఎందుకు వున్నా, మెగాస్టార్ కు, మోహన్ బాబుకు చాలా కాలం క్రితం నడిచిన మాటల వార్ కారణంగా ఇలా అనుకోవడం సహజమే.