‘ఈనాడు-జెమిని’ కిరణ్‌లు నిర్మాతలుగా సినిమా!

ఇద్దరు కిరణ్‌లు కలిసి ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈనాడు ఎండీ కిరణ్‌ (ఉషాకిరణ్‌ మూవీస్‌ అధినేత రామోజీరావు తనయుడు), సీనియర్‌ నిర్మాత జెమిని కిరణ్‌ ఇద్దరూ కలిసి ఒక చిత్ర నిర్మాణం ప్లాన్‌ చేస్తున్నారు.…

ఇద్దరు కిరణ్‌లు కలిసి ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈనాడు ఎండీ కిరణ్‌ (ఉషాకిరణ్‌ మూవీస్‌ అధినేత రామోజీరావు తనయుడు), సీనియర్‌ నిర్మాత జెమిని కిరణ్‌ ఇద్దరూ కలిసి ఒక చిత్ర నిర్మాణం ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ హీరోగా నిర్ణయించారు. 

తెలుగులో రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన రికార్డు రామోజీరావు పేరు మీదనే ఉంది. ఆయన వారసుడిగా సినిమాల నిర్మాణ వ్యవహారాలను ఈనాడు ఎండీ కిరణ్‌ చూస్తున్నారు. అయితే అతిపెద్ద రామోజీ ఫిలింసిటీ, స్క్రిప్టుతో వస్తే చాలు.. ఫస్ట్‌కాపీతో బయటకు వెళ్లగల ఆధునాతనమైన సకల సదుపాయాలు తమ సొంతంగా ఉన్నప్పటికీ.. రామోజీరావు నిర్మాణం నుంచి సినిమా బయటకు వచ్చి చాలాకాలం గడచిపోయింది. ఇప్పుడు ఆయన కొడుకు కిరణ్‌.. జెమిని కిరణ్‌తో కలిసి సంయుక్తంగా చిత్ర నిర్మాణం చేపడుతున్నారు. 

సందీప్‌కిషన్‌ ను హీరోగా ఎంచుకోవడంలోనే యూత్‌ బేస్డ్‌ సినిమా చేయాలనే ఉద్దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు ఇంకా ఖరారు కాలేదు.