ఎక్స్‌ప్రెస్‌ పిల్ల దూసుకెళ్తోంది

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో విజయం సొంతం చేసుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ ఏడాది ఆరంభంలో బాలీవుడ్‌లోను విజయ బావుటా ఎగరేసింది. యారియాన్‌ సినిమా చిన్న సినిమాల్లో ఘన విజయాన్ని అందుకోవడంతో రకుల్‌కి బాలీవుడ్‌లో కూడా…

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో విజయం సొంతం చేసుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ ఏడాది ఆరంభంలో బాలీవుడ్‌లోను విజయ బావుటా ఎగరేసింది. యారియాన్‌ సినిమా చిన్న సినిమాల్లో ఘన విజయాన్ని అందుకోవడంతో రకుల్‌కి బాలీవుడ్‌లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. 

షిమ్లా మిర్చి అనే సినిమాలో రకుల్‌ కథానాయికగా ఎంపికైంది. రాజ్‌కుమార్‌ రావు సరసన ఈ చిత్రంలో నటించబోతున్న రకుల్‌ ప్రీత్‌ ఇది తనకి బాలీవుడ్‌లో మరో విజయాన్ని ఇస్తుందని ధీమాగా ఉంది. తెలుగులో కూడా ఆమెకి అవకాశాలు బాగా వస్తున్నాయి. 

మంచు మనోజ్‌ సరసన కరెంట్‌ తీగ చిత్రంలో నటిస్తోన్న రకుల్‌ మరో చిత్రంలో గోపీచంద్‌ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. స్మార్ట్‌ ఛాయిస్‌లతో హీరోయిన్‌గా నెమ్మదిగా తన స్థాయిని పెంచుకుంటోన్న రకుల్‌కి పెద్ద హీరోల సరసన నటించే స్టఫ్‌ ఉందనేది సినీ విశ్లేషకుల ఫీలింగ్‌. ఆ రోజు ఎంతో దూరంలో లేదనే కాన్ఫిడెన్స్‌ రకుల్‌లో ఫుల్‌గా ఉంది.