Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

అందరికీ ఫ్లాపులు.. ఒక్క హిట్ కోసం ఇలా..!

అందరికీ ఫ్లాపులు.. ఒక్క హిట్ కోసం ఇలా..!

ఇలా వీళ్లంతా కలిసి చేస్తున్న సినిమా చిత్రలహరి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్నట్నుంచి మొదలైంది. ఇలా ఫ్లాపుల బ్యాచ్ అంతా కలిసి ఓ హిట్ కోసం చేస్తున్న ప్రయత్నానికి నిన్న కొబ్బరికాయ కొట్టారు.

క్రేజీ కాంబినేషన్లు కలిస్తే సినిమాకు బజ్ వస్తుంది. వెంటవెంటనే మార్కెట్ జరుగుతోంది. కానీ ఇలాంటి కాంబినేషన్లు కలిస్తే మూవీని మార్కెట్ చేయడం కష్టం. అమర్ అక్బర్ ఆంటోనీతో ఈ విషయం 'మైత్రీ' నిర్మాతలకు బాగా తెలిసొచ్చింది. అయినప్పటికీ ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టు కావడంతో సెట్స్ పైకి తీసుకొచ్చారు.

ఇదే పొజిషన్ లో దిల్ రాజు ఉంటే అతడి ప్లాన్స్ వేరేలా ఉంటాయి. హీరోహీరోయిన్లకు క్రేజ్ లేనప్పుడు ప్రాజెక్టుకు అతడు ఏదో ఒక ఎట్రాక్షన్ జోడిస్తాడు. మైత్రీ మూవీమేకర్స్ ఆ పని కూడా చేయలేకపోయారు. దాదాపు 90శాతం తెలుగు ప్రేక్షకులకు తెలియని నివేత పేతురాజ్ అనే అమ్మాయిని సెకెండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ మొత్తం ప్రాజెక్టులో అందరికీ ఆశాదీపం ఒక్కడే. అతడే దేవిశ్రీప్రసాద్. దేవిశ్రీ తన మ్యూజిక్ తో హైప్ తీసుకురాగలిగితే ఈ సినిమా కాస్త లైమ్ లైట్లోకి వస్తుంది. ఒకవేళ 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాను లైట్ తీసుకున్నట్టు, ఈ సినిమాను కూడా దేవిశ్రీ తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఇక చిత్రలహరి గాల్లో దీపమే.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?