Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒక్క ట్వీట్ పెట్టింది.. మళ్లీ దొరికిపోయింది

ఒక్క ట్వీట్ పెట్టింది.. మళ్లీ దొరికిపోయింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు సోషల్ మీడియాలో తిట్లు తినడం కొత్తేంకాదు. గతంలో ఓసారి చెత్త డ్రెస్సింగ్ కారణంగా నెటిజన్లకు బుక్కయిపోయింది. మొన్నటికిమొన్న మంచులక్ష్మితో అసభ్యంగా దిగిన ఓ ఫొటో కారణంగా ట్రోలింగ్ కు గురైంది. రీసెంట్ గా శ్రీదేవి లుక్ లో విడుదలైన రకుల్ ఫొటో కూడా ట్రోలింగ్ కు గురైంది. శ్రీదేవి వేషంలో ఉన్న శ్రీరెడ్డిలా ఉందంటూ ఆమెపై కామెంట్స్ పడ్డాయి.

తాజాగా ఇప్పుడు మరోసారి నెటిజన్లకు దొరికిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈసారి ఈమె తప్పు ఏమీలేదు. కేవలం శుభాకాంక్షలు చెప్పిన పాపానికి నలుగురి నోట్లోపడి పచ్చడైపోయింది రకుల్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. నిన్న ఆర్-ఆర్-ఆర్ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ పై ఫస్ట్ షాట్ తీశాడు రాజమౌళి. ఆ ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు.

ట్విట్టర్ లో ఫొటో పెట్టిన వెంటనే ఆల్ ది బెస్ట్ చెప్పింది రకుల్. వెండితెరపై మరో మేజిక్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననంటూ తెలిపింది. రకుల్ పెట్టిన పోస్టులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నెటిజన్లు మాత్రం ఆ ట్వీట్ ను మరోలా అర్థం చేసుకున్నారు. రాజమౌళి సినిమాలో హీరోయిన్ వేషం కోసమే రకుల్ ఇలా బిస్కెట్లు వేస్తోందని కామెంట్లు పెట్టారు.

నువ్వు ఎంత పొగిడినా రాజమౌళి నీకు ఛాన్స్ ఇవ్వడని కొందరు కామెంట్లు పెడితే, ఎంత కాకాపట్టినా అక్కడ పడేవారు లేరంటూ మరికొందరు జోకులేశారు. ఇక ఫ్యాన్స్ అయితే మా చరణ్ ను వదిలేయ్ అంటూ పోస్టులు పెడుతుంటే, మా తారక్ జోలికి అస్సలు రావొద్దు ప్లీజ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ లో ఇంకా హీరోయిన్లను ఫిక్స్ చేయలేదు. ఇప్పటివరకు వినిపించిన 3-4 పేర్లలో రకుల్ పేరు మాత్రంలేదు. కైరా అద్వానీ, రాశిఖన్నా, కీర్తిసురేష్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి తప్ప రకుల్ ప్రస్తావన రాలేదు.

మరి ఈ పొగడ్తతో రాజమౌళి నిజంగానే రకుల్ పేరును కూడా పరిశీలిస్తాడేమో. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ రకుల్ తో వర్క్ చేసిన అనుభవం ఉంది. 

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?