గడ్డం మాసింది…బైట్ ఇవ్వలేను

బాపు లాంటి దిగ్దర్శకుడు మరణించిన వార్త తెలిసిన అనంతరం టీవీ చానెళ్ల రిపోర్టర్లు సినిమా వారి బైట్ల కోసం ప్రయత్నించినపుడు చిత్రమైన సంగతులు జరిగాయట. ఓ పెద్ద దర్శకుడు, గడ్డం మాసిందని ఇప్పుడు బైట్…

బాపు లాంటి దిగ్దర్శకుడు మరణించిన వార్త తెలిసిన అనంతరం టీవీ చానెళ్ల రిపోర్టర్లు సినిమా వారి బైట్ల కోసం ప్రయత్నించినపుడు చిత్రమైన సంగతులు జరిగాయట. ఓ పెద్ద దర్శకుడు, గడ్డం మాసిందని ఇప్పుడు బైట్ ఇవ్వలేనని, ఫోన్ లో మాత్రం చెప్పగలనని అన్నారట. 

మరో సీనియర్ నటుడిని సార్..చెన్నయ్ వెళుతున్నారా అని అడిగితే..ఆఫ్ ది రికార్డుగా 'ఏం పోతాంరా చెన్నయ్..ఇక్కడయితే ఏదో చూసొచ్చేవాళ్లం' అన్నారుట,. ఓ సీనియర్ హీరోను అడిగితే,.ఫలానా దానికి తనకు లాస్ వచ్చిందని, మళ్లీ ఇదో ఖర్చా అని అన్నారట. మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకన్న బాపు మరణం పట్ల పరిశ్రమలో పలువురు స్పందించిన తీరుకు టీవీ రిపోర్టర్లు తెల్లబోవాల్సి వచ్చింది. ఆపై ఆవేదన చెందాల్సి వచ్చింది.