ఇద్దరు వెంకీ లను లాక్ చేస్తున్నారు.

కొత్త డైరక్టర్ల సినిమా హిట్ అయితే చాలు, ఎక్కడి బ్యానర్ లో అక్కడ లాక్ చేసేస్తున్నారు. టాలీవుడ్ కు డైరక్టర్ల కొరత పట్టుకుంది. అంటే డైరక్టర్లు లేరు అని కాదు, కొత్తగా ఆలోచించించేవారు కావాలి.…

కొత్త డైరక్టర్ల సినిమా హిట్ అయితే చాలు, ఎక్కడి బ్యానర్ లో అక్కడ లాక్ చేసేస్తున్నారు. టాలీవుడ్ కు డైరక్టర్ల కొరత పట్టుకుంది. అంటే డైరక్టర్లు లేరు అని కాదు, కొత్తగా ఆలోచించించేవారు కావాలి.

నిన్న కొత్తగా ఆలోచిస్తే చాలదు, ఇవాళ, రేపు కూడా కొత్తగానే ఆలోచించాలి. అందుకే తెగ వెదుకుతున్నారు ఇటు హీరోలు, అటు నిర్మాతలు కూడా. కొత్తవాళ్లను పట్టుకుని సినిమా చేస్తున్నారు. బాగుంటే వెంటనే పోటీలు పడి లాక్ చేస్తున్నారు.

నిన్నటికి నిన్న ఛలో సినిమా డైరక్టర్ వెంకీ కుడుములను చాలా సంస్థలు, హీరోలు సంప్రదించి లాక్ చేసే పనిలో వున్నాయి. ఇప్పుడు తొలిప్రేమ డైరక్టర్ వెంకీ అట్లూరిని కూడా అప్పుడే లాక్ చేసేసారు.

వెంకీని దర్శకుడిని చేయాలనుకున్నది దిల్ రాజు. ఆయనే ఈ ప్రాజెక్టు అంతా సెట్ చేసి, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు అందించారు. మళ్లీ పైనల్ ప్రొడక్ట్ ను మంచి ప్రయిస్ కు దిల్ రాజే కొన్నారు.

అందుకే వెంకీ అట్లూరిని తమ బ్యానర్ లో మూడో సినిమాకు దిల్ రాజు లాక్ చేసినట్లు తెలుస్తోంది. రెండో సినిమా తొలిప్రేమ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కే చేయడానికి డిసైడ్ అయినట్లు తెలిసింది.

సో, ఇక నిర్మాతలు వెంకీ అట్లూరి డేట్ల కోసం చూడక్కరలేదు. కానీ యంగ్ హీరోలు మాత్రం దిల్ రాజును, బివిఎస్ఎన్ ప్రసాద్ ను పట్టుకుంటే, వెంకీ చేయబోయే మంచి సినిమాలు దొరికే అవకాశం వుంది.