ఇదేం పనమ్మా.. అనసూయా?

సెలబ్రిటీలకు వున్నంత సెల్ఫీ పిచ్చి ఎవరికీ వుండదు. ఊ అంటే సెల్ఫీ.. ఆ అంటే సెల్ఫీ తీసుకుంటారు. వాళ్లకు వాళ్లు సెల్ఫీలు తీసుకుని సంబరపడిపోతారు. కానీ బయటవాళ్లు ఎవరైనా సెల్ఫీ అడిగితే కిందా మీదా…

సెలబ్రిటీలకు వున్నంత సెల్ఫీ పిచ్చి ఎవరికీ వుండదు. ఊ అంటే సెల్ఫీ.. ఆ అంటే సెల్ఫీ తీసుకుంటారు. వాళ్లకు వాళ్లు సెల్ఫీలు తీసుకుని సంబరపడిపోతారు. కానీ బయటవాళ్లు ఎవరైనా సెల్ఫీ అడిగితే కిందా మీదా అయిపోతారు.

ఓ చిన్న కుర్రాడు అత్యుత్సాహంతో సెల్ఫీ అడిగితే ఏంకర్ అనసూయ, ఫోన్ లాక్కుని పగలగొట్టిపోయిందట. ఇదేం అన్యాయం అని పోలీసులను ఆశ్రయించింది ఆ కుర్రాడి తల్లి.

తార్నాక ప్రాంతంలోని విజయపురి కాలనీలో ఓ కుర్రాడు తల్లితో కలిసి స్కూలుకు వెళ్తుంటే ఏంకర్ అనసూయ కనిపించిదంట. వెంటనే అత్యుత్సాహంతో పరుగెత్తి సెల్ఫీ అడిగాడంట. దానికి అనసూయ కోపంతో, ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తన వెహికిల్ ఎక్కి వెళ్లిపోయిందట. ఈ మేరకు తార్నాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మాట ఎలా వున్నా, తరువాత రాజీ ఎలాగూ కుదిరే అవకాశం వుంటుంది కనుక, ఆ విషయం అలా వదిలేసినా, ఈవిడియో మాత్రం వాట్సప్ లో అప్పుడే హల్ చల్ చేయడం ప్రారంభించేసింది. ఇటు తిరిగి, అటు తిరిగి సాయంత్రానికి వైరల్ అయిపోతుంది. చానెళ్ల మాదిరిగానే వాట్సప్ వాడేవాళ్లకు కూడా రోజూ ఏదో ఒకటి ఇలాంటది కావాలి. అటు ఇటు సర్క్యులేట్ చేయడానికి.