Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇప్పుడేం మాట్లాడను-బోయపాటి

ఇప్పుడేం మాట్లాడను-బోయపాటి

దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ మౌనవ్రతం పాటిస్తున్నారు. అది కూడా కేవలం మీడియా ముందే. అఖండ సినిమా విడుదలకు ముందు ఆయన మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. సినిమా మార్నింగ్ షో పడిన తరువాత మధ్యాహ్నం సమయంలో మీడియాతో మాట్లాడాలని డిసైడ్ అయిపోయారు.

సాధారణంగా సినిమా విడుదలకు ముందు మీడియాతో మాట్లాడడం అన్నది డైరక్టర్లకు అలవాటు కొంత మంది ముందు వద్దు తరువాత మాట్లాడదాం అంటారు. అలా మాట్లాడడం అన్నది కొన్నిసార్లు ఙరుగుతుంది. కొన్ని సార్లు జ‌రగదు. సినిమా బాగుంటే మీడియా ముందుకు వస్తారు. డింకీ కొడితే ఇక కనిపించరు.

బోయపాటి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం వినయ విధేయ రామ సినిమా కావచ్చు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ సినిమా విడుదలకు ముందు ఆయన మీడియాతో తెగ మాట్లాడారు. ఆ సినిమా గురించి ఆయన మామూలుగా కబుర్లు చెప్పలేదు. కానీ వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పల్టీ కొట్టింది. జ‌నాలు బొయపాటి సినిమా ముందు చెప్పిన కబుర్లను పట్టుకుని విపరీతంగా ట్రోల్ చేసారు.

బహుశా అందుకే ఇప్పుడు విడుదల తరువాతే మట్లాడాలని బోయపాటి డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అఖండ సినిమా మీద బోయపాటి చాలా నమ్మకంతో వున్నారు.కధానాయకుడు..మహానాయకుడు తరువాత ఆ రేంజ్ లో మార్కెట్ అయిన బాలయ్య సినిమా అఖండ నే. ఆ సినిమా మీద ఆ లెవెల్ అంచనాలు వున్నాయి.

అందుకే బోయపాటి తన మౌనాన్ని విడుదల మధ్యాహ్నం బద్దలు కొడతారు. సినిమా హిట్ టాక్ తరువాత వచ్చే జోష్ వేరు. మాటలు వేరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?