కంగారొద్దు.. మహేష్‌తో సినిమా వుంది

హారిక హాసిని సంస్థ తమ ఆరవ చిత్రంగా వెంకీ, త్రివిక్రమ్‌ల సినిమా అనౌన్స్‌ చేయడంతో ఎన్టీఆర్‌ తర్వాత మహేష్‌ని డైరెక్ట్‌ చేయాలని ప్లాన్‌ చేసిన త్రివిక్రమ్‌ అది డ్రాపయ్యాడా అనే చర్చ మొదలైంది. అయితే…

హారిక హాసిని సంస్థ తమ ఆరవ చిత్రంగా వెంకీ, త్రివిక్రమ్‌ల సినిమా అనౌన్స్‌ చేయడంతో ఎన్టీఆర్‌ తర్వాత మహేష్‌ని డైరెక్ట్‌ చేయాలని ప్లాన్‌ చేసిన త్రివిక్రమ్‌ అది డ్రాపయ్యాడా అనే చర్చ మొదలైంది. అయితే ఇది హారిక హాసిని సంస్థ తీసే ఆరవ సినిమానే కానీ, ఎన్టీఆర్‌తో సినిమా తర్వాత త్రివిక్రమ్‌ చేసే చిత్రం ఇది కాదట.

వరుసగా హారిక హాసిని సంస్థకి సినిమాలు చేస్తోన్న త్రివిక్రమ్‌కి మైత్రి మూవి మేకర్స్‌ సంస్థ ఎప్పుడో అడ్వాన్స్‌ ఇచ్చింది. వారి బ్యానర్లోనే మహేష్‌ చిత్రాన్ని త్రివిక్రమ్‌ చేయాల్సి వుంది. కనుక హారిక హాసిని సంస్థలో ఎన్టీఆర్‌తో చేసే చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ గ్యాప్‌ తీసుకుంటాడు. అనంతరం వెంకీ సినిమా మొదలవుతుంది.

వెంకీతో త్రివిక్రమ్‌ చేసే చిత్రంపై కూడా ఇంకా సరయిన క్లారిటీ లేదు. వెంకటేష్‌ హీరో అని ఖరారు చేసారే కానీ ఇది మల్టీస్టారరా కాదా అని కూడా చెప్పలేదు. వెంకటేష్‌ మాత్రం తనకి త్రివిక్రమ్‌ ఒక మల్టీస్టారర్‌ ఐడియా చెప్పాడని గతంలో ఒక సందర్భంలో మీడియాకి చెప్పాడు. మహేష్‌ చేసే ఇరవై ఆరవ చిత్రమైతే త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లోనే వుంటుంది. అందులో ఎలాంటి మార్పు లేదనేది ప్రస్తుత సమాచారం.