కరిష్మాకి మళ్ళీ పెళ్ళంట

బాలీవుడ్‌ భామ కరిష్మాకపూర్‌ మరోమారు పెళ్ళిపీటలెక్కబోతోందిట. సంజయ్‌కపూర్‌ అనే వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు దూరమైన కరిష్మా, కొన్నాళ్ళ క్రితం విదేశాల నుంచి ఇండియాకి తిరిగొచ్చింది. సినిమాల్లో మళ్ళీ బిజీ అవ్వాలనుకుంటోంది కూడా. సినిమాల్లో రీ`ఎంట్రీ…

బాలీవుడ్‌ భామ కరిష్మాకపూర్‌ మరోమారు పెళ్ళిపీటలెక్కబోతోందిట. సంజయ్‌కపూర్‌ అనే వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు దూరమైన కరిష్మా, కొన్నాళ్ళ క్రితం విదేశాల నుంచి ఇండియాకి తిరిగొచ్చింది. సినిమాల్లో మళ్ళీ బిజీ అవ్వాలనుకుంటోంది కూడా. సినిమాల్లో రీ`ఎంట్రీ సంగతలా వుంచితే, భర్త సంజయ్‌కపూర్‌ తన మొదటి భార్యకు మళ్ళీ దగ్గరవుతుండడాన్ని కరిష్మాకపూర్‌ జీర్ణించుకోలేకపోయింది.

మొదటి భార్యను కాదని, తనను పెళ్ళాడిన సంజయ్‌ మళ్ళీ తనను కాదని మొదటి భార్యకు దగ్గరవుతుండడంతో, భర్తకు విడాకులిచ్చేసింది కరిష్మాకపూర్‌. అధికారికంగా విడాకుల ప్రక్రియ పూర్తయిపోవడంతో, ఇప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనలో పడ్డ కరిష్మాకపూర్‌, ఈ మేరకు సన్నిహితులకీ విషయాన్ని వెల్లడిరచిందిట.

సందీప్‌ తోష్నీవాల్‌ అనే వ్యక్తితో ఈ మధ్య కరిష్మా సన్నిహితంగా మెలుగుతోందని బాలీవుడ్‌ సినీ జనం గత కొన్నాళ్ళుగా చెవులు కొరుక్కుంటున్నారు. అతన్నే కరిష్మా పెళ్ళాడనుందని సమాచారం. ప్రస్తుతం కరిష్మాకి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. సంజయ్‌తో కరిష్మా నడిపిన వైవాహిక జీవితానికి గుర్తులు ఆ ఇద్దరు పిల్లలు. ఇక మళ్ళీ పెళ్ళి విషయాన్ని కరిష్మా గోప్యంగా వుంచుతోంది. త్వరలోనే ఈ విషయమై అధికారికంగా కరిష్మా ఓ ప్రకటన చేసే అవకాశం వుందట.