Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కోన వెంకట్ డబుల్ స్టేట్ మెంట్

కోన వెంకట్ డబుల్ స్టేట్ మెంట్

లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా వినిపించిన పేరు నిశ్శబ్దం. ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫారమ్ లోకి వస్తుందని ఎక్కువగా వినిపించింది. కానీ ఆల్ మోస్ట్ లాక్ డౌన్ అయిపోతోంది కానీ ఏ విషయం క్లారిటీ రాలేదు. ఈ విషయంలో రకరకాల గ్యాసిప్ లు వినిపించాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సినిమా నిర్మాణంతో అంతో ఇంతో సంబంధం వున్న రచయిత కోనవెంకట్  వేసిన రెండు ట్వీట్ లు మరో ఎత్తు. 

ఆయన మూడు రోజుల తేడాతో రెండు ట్వీట్ లు వేసారు. 

ఇదిలా వుంటే సినిమాకు పెట్టుబడి పీపుల్స్ మీడియాది. కోనవెంకట్ షేర్ కలిసారా? ప్రాజెక్టు సెట్ చేసి, కథ తదితర వ్యవహారాలు చూసినందుకు భాగస్వామ్యం లభించిందా? అన్నది వారికే తెలియాలి. డబ్బు పెట్టిన వారికి నొప్పి వుంటుంది తప్ప, పెట్టని వారికి కాదు కదా..ఐ లవ్ థియేటర్ అని చెప్పడం సులువే. అసలు బాధ నిర్మాతది కదా? అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలే థియేటర్ల ఆదాయం ఎలా వుంటుంది అన్నది ఊహకు అందడం లేదు. మామూలుగా వుండొచ్చు..లేదా ఉండకపోవచ్చు. ఇలాంటి టైమ్ లో రిస్క్ చేయడం అన్నా ఓటిటికి ఇచ్చుకోవడమే బెటర్ అనే ఆలోచన కనుక నిర్మాతలు చేస్తూ వుంటే, ఇలా ట్వీట్ ల ద్వారా వాళ్లను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకో? మరి?

త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ న్యూస్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?